విజయ్ , ధనుష్ ఇప్పుడు సూర్య .. ఈ బ్యూటీ లక్ మామూలుగా లేదుగా..!

frame విజయ్ , ధనుష్ ఇప్పుడు సూర్య .. ఈ బ్యూటీ లక్ మామూలుగా లేదుగా..!

Amruth kumar
కోలీవుడ్ హీరో సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రెట్రో మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే ఈ సినిమాకు రిలీజ్ కు రెడీగా ఉంది .. ఈ సినిమాలో సూర్యకు జంటగా పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానన్నారు .. అలాగే ఈ సినిమా తర్వాత సూర్య తన 45వ సినిమాలో కూడా నటిస్తున్నారు .. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి చివరి దశకు వచ్చేసింది .. సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో ఎంతో శరవేగంగా జరుగుతుంది . అలాగే ఈ సినిమాలో సూర్యకు జంటగా త్రిష హీరోయిన్ గా నటిస్తుంది ..

సూర్య - త్రిష ఇద్దరు ఈ సినిమాలో న్యాయవాదులుగా కనిపించబోతున్నారు . ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ఆర్జే బాలాజీ ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. సినిమా తర్వాత సూర్య మరో కోలీవుడ్ సినిమా  వాడివాసల్ లో  నటించబోతున్న విషయం తెలిసిందే .. వీటితో పాటు లక్కీ భాస్కర్ , సార్ లాంటి బ్లాక్బస్టర్ సినిమాలు తెర్కక్కించిన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఓకే చేశాడు సూర్య .. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రక‌ట‌న కూడా త్వరలోనే రానుందని కూడా అంటున్నారు .. ఇప్పటికే ఈ సినిమా గురించి కోలీవుడ్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది .  ఇంకా అనౌన్స్ కానీ ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పుడు ఓ వార్త బయటకు వచ్చింది .

ఈ సినిమాలో హీరోయిన్  మమిత బైజు కూడా ఓ ప్రధాన పాత్రలో నటించబోతున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది .. ఇక గతంలో వీరిద్దరూ దర్శకుడు బాల డైరెక్షన్ చేసిన వనంగాన్ సినిమాలో నటించారు .. కానీ ఆ సినిమా నుంచి కొన్ని అనుకోని కారణాలతో సూర్య , మమిత ఇద్దరూ తప్పుకున్నారు .. ఆ తర్వాత అరుణ్ విజయ్ , రీత‌ నటించార‌ని చెబుతారు .. ఈ క్ర‌మంల‌నే దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించబోయే సినిమాలో హీరోయిన్ మమితా బైజు కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారని వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి .. అలాగే త్వరలోనే దీనిపై అధికార ప్రకటన కూడా రానుంది .. ఇటీవలే ధనుష్ హీరోగా వస్తున్న ఓ సినిమాలో కూడా ఈ బ్యూటీ మంచి అవకాశం కొట్టేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: