ప్రభాస్ అమ్మగా నటించిన నటికి గాయాలు.. ఏకంగా 13 కుట్లు..!

frame ప్రభాస్ అమ్మగా నటించిన నటికి గాయాలు.. ఏకంగా 13 కుట్లు..!

Divya
సీనియర్ నటిగా పేరుపొందిన నటి భాగ్యశ్రీ.. బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈమె మొదటిసారి 1989లో సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా వంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిందట. ఈ సినిమా మంచి విజయం అవ్వడంతో పలు చిత్రాలను నటించిన భాగ్యశ్రీ ఆ తర్వాత వివాహం చేసుకోవడంతో  సినిమాలకు దూరంగా ఉన్న ఈమె చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కంగనా రనౌత్ నటించిన తలైవి చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో జయలలిత తల్లి పాత్రలో కనిపించింది. ఇక ఆ వెంటనే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రంలో కూడా ప్రభాస్ కు తల్లి పాత్రలో కనిపించింది.

రాధే శ్యామ్ సినిమా డిజాస్టర్ గా మిగిలిన ఈమె నటనకు మాత్రం బాగానే గుర్తింపు సంపాదించుకుంది. భాగ్యశ్రీ తెలుగు కన్నడలోనే కాకుండా మరాఠీ వంటి భాషలలో కూడా నటిస్తూ తన సినీ కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. అయితే తాజాగా ఈమెకు గాయాలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. పికిల్ బాల్ ఆడుతూ ఉండగా తన తలకు ఒక గాయమైనట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

హాస్పిటల్ బెడ్డు పైన కనిపిస్తూ చికిత్స పొందుతున్నటువంటి దృశ్యాలను కూడా మన ఇక్కడ చూడవచ్చు. అలాగే తన తలపై బ్యాండేజ్ వేసుకొని నవ్వుతూ తను కోలుకుంటున్న విషయాన్ని తెలియజేసింది నటి భాగ్యశ్రీ. అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు మొదట కంగారుపడినప్పటికీ ఆ తర్వాత కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు.. టెన్నిస్, బ్యాడ్మింటన్ పోలి ఉండే పికిల్ బాల్ గేమ్ ని సైతం ఆడడానికి కొన్ని రూల్స్ సైతం ఉంటాయట. ఈ ఆటను హీరోయిన్ సమంత కూడా లైక్ చేస్తుందట. అందుకే హైదరాబాదులో కొండాపూర్ పాడిల్ వేవ్ సంస్థ లో ఈ పికిల్ బాల్ కోర్టును సైతం ఏర్పాటు చేయించింది. అయితే ఈ ఆటను ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: