టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గత ఏడాది నటించిన ఊరిపేరు బైరవకోన, రాయన్ సినిమాలతో మంచి గుర్తింపు తన సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నాడు. ధమాకా మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ అలాగే జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మజాకా సినిమాకు రాజేష్ దండా నిర్మాతగా పనిచేస్తున్నాడు. ఈ సినిమా మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు.
అయితే ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యి మంచి స్పందన పొందాయి. షూటింగ్ మొదలు అయినప్పటినుంది ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు.. కానీ పలు కారణాల వలన అది వాయిదా పడింది. ఆ తర్వాత ఈ సినిమాని ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నట్లు డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాని మహాశివరాత్రికి రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. శివరాత్రి కానుకగా ఈ నెల 26న మజాకా సినిమా విడుదల కానుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. మజాకా మూవీకి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే ఈ మూవీ మంచి మాస్ డ్యాన్స్ తో, కలర్ ఫుల్ విజువల్స్ తో పాటుగా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని రివ్యూ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రీతువర్మ నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మజాకా మూవీకి ధమ్కీ ఫేమ్ లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను కూడా హిట్ కోడతాడని టాక్ నడుస్తోంది.