దోచేయ్ మూవీలోని ఈ అందాల తార ఎవరో తెలుసా..కోట్లల్లో ఆస్తులు ?

Veldandi Saikiran
అక్కినేని నాగచైతన్య గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. హిట్స్, ఫ్లాప్స్ అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు ఏదో ఒక సినిమాతో వస్తూనే ఉంటాడు. ప్రస్తుతం ఈ హీరో తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.... నాగచైతన్య తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేశాడు. అందులో దోచేయ్ సినిమా ఒకటి. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినప్పటికీ నాగచైతన్యను కొత్త రోల్ లో పరిచయం చేశారు. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో చైతన్యకు చెల్లెలుగా నటించిన అమ్మాయి ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది.

ఆ అమ్మాయి పేరు తనయ సచ్ దేవా. తన అద్భుతమైన నటనతో ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన ఈ చిన్నది సినిమాల మీద ఉన్న ఆసక్తితో హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. మొదట మోడలింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది పలు పాపులర్ బ్రాంచ్ కి యాడ్స్ లలో నటించిన తర్వాత దోచేయ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైంది.

అనంతరం పరచేడ్ అనే బోల్డ్ సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే "కహిసుని" అనే టీవీ సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. సినిమాలు, సీరియల్స్ లోనే కాకుండా వెబ్ సిరీస్ లలోను తన నటనను ప్రేక్షకులకు చూపించింది. ఓపిఎస్, లవ్ స్కాండల్స్ & డాక్టర్స్ వంటి వెబ్ సిరీస్ లలో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: