ఆ రాజమౌళి హీరోయిన్ కు ఇప్పటికైనా బ్రేక్ దక్కేనా.. మరి ఇంత దరిద్రమా..!

Amruth kumar
దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్గా నటించిన సలోనిని ఎవరు అంత త్వరగా మర్చిపోలేరు. రాజమౌళి సినిమాలో నటించిన  ప్రతి హీరోయిన్ కి స్టార్ ఇమేజ్ వచ్చింది. వారి కెరియర్ పరంగా కూడా చాలా సక్సెస్ లు చూశారు. అయితే మర్యాద రామన్న సినిమాల్లో సునీల్ కి జంట‌గా నటించిన సలోని మాత్రం ఆశించిన స్థాయిలో హీరోయిన్గా సక్సెస్ అవ్వలేకపోయింది. అక్కినేని హీరో సుమంత్ హీరోగా వచ్చిన ధన 51 సినిమాతో సలోని హీరోయిన్గా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత తరుణ్‌తో ఒక్క ఊర్లోనే సినిమాలో కూడా నటించింది . ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా హిట్ కాలేదు.

ఇక ఆ తర్వాత సిద్ధార్థ కు జంటగా చుక్కల్లో చంద్రుడు సినిమాలో కూడా సలోని నటించింది. ఈ మూవీ కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత కన్నడ, తమిళంలో కూడా అవకాశాలు అందుకని సినిమాలు చేసింది. అయితే రాజమౌళి తెర్కెక్కించిన మర్యాద రామన్న సినిమాతో స‌లోని తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. ఈ సినిమా టాలీవుడ్ లో సలోనికి హీరోయిన్ హీరోయిన్గా వరుస‌ అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో మాత్రమే ఈమెకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చినా కూడా అవి పెద్దగా ఆడలేదు.

అయితే ఆ తర్వాత బాడీగార్డ్ , రేస్ గుర్రం సినిమాల్లో ఈమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే లభించాయి. కానీ ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ అవ్వలేకపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘మట్కా మూవీలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ లో సలోని నటిస్తుంది. పద్మ అనే క్యారెక్టర్ లో సలోని ఈ మూవీలో కనిపిస్తోంది. చాలా నేచురల్ లుక్ లో ఆమె పాత్ర ఉండబోతోందని తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాపై ఆమె చాలా ఆశ‌లు పెట్టుకుంది. ‘మట్కా’ మూవీ హిట్ అయితే కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిన తెలుగులో మళ్ళీ బిజీ అవుతానని అనుకుంటుంది. మరి ఈ బ్యూటీ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: