హవ్వ..లిమిట్స్ క్రాస్ చేస్తున్న జక్కన్న.. మహేశ్ ను ఆ పని చేయమంటూ ఫోర్స్ చేస్తున్నాడా..?

Thota Jaya Madhuri
జక్కన్న ..ఎప్పుడూ కూడా హద్దుల్లోనే ఉంటాడు . హద్దులు మీరీన సీన్స్ తెరకెక్కించడు. ఆయన హద్దుల్లో ఆయన ఉంటూనే మిగతా వాళ్ళని హద్దులు మీరు కుండా చూస్తూ ఉంటారు . ఇవన్నీ మనకు తెలిసిందే . కానీ ఫర్ ద ఫస్ట్ టైం మహేష్ బాబు తో తెరకెక్కించే సినిమా విషయంలో మాత్రం జక్కన్న లిమిట్స్ క్రాస్ చేయడానికి చూస్తున్నాడు అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే మూవీ.


ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో సెట్స్ పైకి రాబోతుంది . అదేరోజు పూజ కార్యక్రమాలు కూడా జరపాలి అనుకుంటున్నారట చిత్ర బృందం . దీనికి సంబంధించి పనులను చకచకా కంప్లీట్ చేసేస్తున్నాడు రాజమౌళి . అయితే మహేష్ బాబు సినిమాని అల్లాటప్పగా తలకెక్కించకుండా చాలా చాలా డిఫరెంట్గా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎవ్వరు తెరకెక్కించని  రేంజ్ లో డైరెక్ట్ చేయాలని భావిస్తున్నాడట జక్కన్న. అందుకే స్పెషల్గా కోచింగ్ కూడా తీసుకుంటున్నారట.


అయితే ఈ సినిమాలో ఒక స్మాల్ స్పెషల్ గెస్ట్ పాత్ర కోసం నమ్రత ను అడుగుతున్నారట . అయితే మొదటి నుంచి నమ్రత పెళ్లి తర్వాత సినిమాలలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు .మహేష్ బాబు పెట్టిన కండిషన్ కారణంగానే ఆమె సినిమాలో నటించట్లేదు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే జక్కన్న డైరెక్ట్ గా మహేష్ బాబునే నమ్రత  ని నటింపజేయాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట . ఆయన వద్దు అన్న కూడా ఆ విషయాన్ని పదేపదే గుర్తుచేస్తూ ఈ రోల్ కి నమ్రతానే బాగుంటుంది అంటూ బలవంతం చేస్తున్నారట .


గతంలో మగధీర సినిమా విషయంలోనూ జక్కన ఇలాగే చేశాడు. మెగాస్టార్ చిరంజీవిని మగధీర సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం కొన్ని మినిట్స్ ఆ పాటలో కనిపించేలా చేశాడు. ఆ తర్వాత యమదొంగ సినిమాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని టెక్నాలజీ ఉపయోగించి చిందులు వేసేలా చేశారు. ఇప్పుడు నమ్రత ని సైతం రాజమౌళి అదే లిస్టులోకి తీసుకో రాబోతున్నాడు అంటూ తెలుస్తుంది . అయితే మహేష్ బాబు సినిమాలో నమ్రత  నటించేందుకు యాక్సెప్ట్ చేస్తుందా..? లేదా..? అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది..!!???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: