మాజీ కోడలకు స్పెషల్ ఇన్విటేషన్..నాగార్జున చేసిన పనికి షాక్ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్..!?

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో ప్రెసెంట్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు హ్యూజ్ రేంగ్ లో ట్రెండ్ అవుతుంది . దానికి కారణం  అక్టోబర్  28 అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వరరావు శత దినోత్సవ వేడుకలు జరగబోతూ ఉండడమే . కాగా ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్లుగా అమితాబచ్చన్ .. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. దీనికి సంబంధించి నాగర్జున పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. నాగార్జున ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని కలిసి అక్కినేని జాతీయ పురస్కారం స్వీకరించాలని గౌరవంగా ఆహ్వానించారు .


అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫోటోలు కింగ్ నాగార్జున ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఆసక్తికర పోస్టు కూడా పెట్టారు . "ఈ ఏడాది నాకు చాలా చాలా ప్రత్యేకమైనది నాన్నగారు శతజయంతి వేడుకలకు చిరంజీవి , అమితాబచ్చన్ రానున్నారు . ఈ వేడుక నాకు చాలా ప్రత్యేకం . ఈ  వేడుకను మరపురానిదిగా చేద్దాం" అంటూ రాసుకొచ్చారు . దీనితో పాటు మెగా ఫాన్స్ ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఈ పోస్ట్ ను ఎక్కువగా లైక్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు .


కాగా ఇదే మూమెంట్లో సినిమా ఇండస్ట్రీలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ వేడుకకు అక్కినేని మాజీ కోడలు సమంతకు కూడా ఇన్విటేషన్ అందినట్లు తెలుస్తుంది . ఇదే కాదు గతంలో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు గారి శతదినోత్సవ వేడుకలకు కూడా సమంతకు ఇన్విటేషన్ అందిందట. కానీ సమంతనే కొన్ని కారణాలు చేత అటెండ్ కాలేకపోయిందట.  కానీ కింగ్ నాగార్జున మాత్రం మళ్లీ ఈసారి కి  మాజీ కోడలిని గౌరవిస్తూ నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలకు సంబంధించిన ఈవెంట్ కి ఇన్విటేషన్ సమంతకు పంపారట. అయితే సమంత ఈ వేడుకకు వస్తుందా ..? రాదా..? అనేది బిగ్ డౌట్. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతుంటే ఇంకా మాజీ కోడలికి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి..? అంటూ మరికొందరు మాట్లాడుతూ ఉంటే ..అది నాగార్జున మంచితనం అంటూ అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున ను చెట్టు పైకి ఎక్కించేస్తున్నారు.  అసలు సమంత ఈ ఈవెంట్ కి వస్తుందా..? రాదా..? అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: