శారీ అందాలతో సెగలు పుట్టిస్తున్న ఒంగోలు గిత్త హీరోయిన్..!

FARMANULLA SHAIK
తెలుగులో సక్సెస్‌ కోసం ప్రయత్నించిన ఉత్తరాది భామల్లో ఒకరు కృతి కర్బందా. అక్కినేని సుమంత్‌తో కలిసి బోణీ సినిమాతో తొలిసారి సిల్వర్ స్రీన్‌పై మెరిసింది. పవన్‌ కల్యాణ్‌ నటించిన తీన్మార్‌ సినిమాలో వన్ ఆఫ్‌ ది ఫీ మేల్‌ లీడ్‌లో మెరిసిన ఈ భామ ఇండస్ట్రీలో తన 15 ఏండ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికీ తీన్మార్ సినిమా కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తీన్మార్ లో పవన్, కృతి మధ్య వచ్చే లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన కృతి కర్బంద అంతకు ముందే తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ సరసన మిస్టర్ నూకయ్య, రామ్ పోతినేని ఒంగోలు గిత్త వంటి చిత్రాల్లో మెరిసింది. అయినప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. బ్రూస్ లీ చిత్రంలో రామ్ చరణ్ సోదరిగా నటించింది. కన్నడలో యష్ తో కలిసి గూగ్లీ తో విజయాన్ని అందుకున్న కృతి ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీకి సరైన అవకాశాలు మాత్రం రాలేదు.
బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కృతి. కృతి, పుల్కిత్‌ సామ్రాట్‌ కలిసి తైష్, పాగల్ పంటి, వీరే ది వెడ్డింగ్ చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న కృతి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. పుల్కిత్ సామ్రాట్ గతంలో శ్వేతా రోహిరాను 2014లో వివాహం చేసుకోగా మనస్పర్థలతో వీరు 2018లో విడిపోయారు.ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఒకటి షూటింగ్ పూర్తి చేసుకోగా మరొకటి చిత్రీకరణ దశలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: