రాజమౌళి లీకులతో మహేష్ అభిమానులలో జోష్ !

Seetha Sailaja
మహేష్ రాజమౌళి ల కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న మూవీ గురించి ఏచిన్న వార్తా మీడియాలో వచ్చినా అది వెంటనే వైరల్ గా మారుతోంది. వాస్తవానికి ఈ మూవీ ఈపాటికే సెట్స్ పైకి వెళ్ళవలసి ఉన్నప్పటికీ ఈమూవీ కథ విషయంలో జరిగిన కొన్ని మార్పులు చేర్పులు వల్ల ఈమూవీ షూటింగ్ కొంత వరకు ఆలస్యం అయింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీని రెండు భాగాలుగా తీయాల లేదంటే సింగిల్ పార్ట్ లో ముగించాల అన్న విషయమై చాల లోతైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈమూవీ బడ్జెట్ దాదాపు 8 వందల కోట్లకు పైగా దాటిపోతూ ఉండటంతో ఈమూవీని రెండు భాగాలుగా తీసినప్పుడు మాత్రమే నిర్మాత సేఫ్ జోన్ లో ఉంటాడు కాబట్టి ఆవిషయంగా అడుగులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే మహేష్ దాదాపు 4 సంవత్సరాల పాటు రాజమౌళి కాంపౌండ్ లో ఉండిపోవలసి వస్తుంది అని అంటున్నారు.

ఈకథ ఆఫ్రికన్ అడవుల చుట్టూ తిరుగుతుందని ఇప్పటికే లీకులు వచ్చిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా రాజమౌళి ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆశక్తిర విషయాలు షేర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ మూవీలో ‘ఆర్ ఆర్ ఆర్’ కంటే ఎక్కువ జంతువులను రాజమౌళి లీక్ లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో వచ్చిన ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ వ్యాను బోనులో జంతువులను దించుతూ ఎగిరే సీన్ ఏ స్థాయిలో ఉంటుందో అలాంటి సీన్స్ ను మించి తన కొత్త మూవీలో కనిపించబోతున్నాయి అంటూ జక్కన్న 9 లీకులతో మహేష్ అభిమానులలో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. అంతేకాదు మహేష్ తో తీయబోతున్న మూవీలో ఒక జంతు ప్రపంచం కనిపించబోతోంది అంటూ జక్కన్న ఇచ్చిన లీకులు వైరల్ గా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: