పెళ్లికి ముందే నాగ్ మామకు కోడలు పిల్ల బిగ్ షాక్.. అక్కినేని ఫ్యాన్స్ కు మండిస్తున్న శోభిత ధూళిపాళ్ల..!?

Thota Jaya Madhuri
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ తెలుగు సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది.  మనకు తెలిసిందే మరికొద్ది రోజుల్లోనే అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఎవరికీ చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట .. ఆగస్టు 8వ తేదీ అక్కినేని నాగార్జున ఇంట్లో చాలా సింపుల్గా ..చాలా సాంప్రదాయ బద్దంగా.. అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థపు వేడుకను ఘనంగా చేసుకున్నారు . దానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చేవరకు కూడా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లకు నిశ్చితార్ధం జరిగిన సంగతి ఎవరికీ తెలియదు .


నాగార్జున కూడా ఆ న్యూస్ ని అప్పుడు అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు . ఆ తర్వాత వీళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో మనకు తెలుసు . కాగా రీసెంట్గా శోభిత ధూళిపాళ్ల తన పెళ్లికి సంబంధించిన ఫస్ట్ పనిని పూర్తిగా సక్సెస్ఫుల్గా క్లియర్ చేసింది. పసుపు దంచె ఫంక్షన్ ను కంప్లీట్ చేసుకుంది కాబోయే పెళ్లి కూతురు. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది . చాలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది .


తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి తర్వాత హైదరాబాద్ లో సెటిల్ కాకుండా ముంబై కి వెళ్లబోతున్నారట. శోభిత కి తెలుగు లో కన్నా బాలీవుడ్ లోనే ఆఫర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముంబై లో ఆమెకు సొంత ఇల్లు కూడా ఉంది.  అంతేకాకుండా నాగచైతన్యను  బాలీవుడ్లో బాగా నిలదొక్కుకునేలా శోభితా ధూళిపాళ్ల తన బ్యాక్ గ్రౌండ్ యూస్ చేసి అక్కడ సరికొత్త లైఫ్ నాగచైతన్యకు ఇవ్వబోతుందట.


ఆల్రెడీ దీని గురించి నాగచైతన్యతో కూడా చర్చించిందట.  అయితే నాగార్జునకు మాత్రం ఈ విషయాన్ని నిశ్చితార్థం అయ్యాకే చెప్పాడట నాగచైతన్య. కూతురిని అప్పగింతలు చేసినట్టు నాగచైతన్యను శోభితకు అప్పగింతలు చేస్తున్నావ అంటూ నాగార్జున ను ఓ  రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు . అయితే కొత్త కోడలు శోభిత ధూళిపాళ్ల నాగ్ మామకు బిగ్ షాక్ ఇచ్చింది అని.. ముంబై కి వెళ్తే నాగచైతన్య ఇక  అక్కినేని నాగార్జున కుటుంబాన్ని పూర్తిగా వదిలేసినట్టేనని చెప్పుకొస్తున్నారు జనాలు. చూద్దాం మరి నాగచైతన్య ఏం చేస్తారో..??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: