ఒక్క మాటతో ప్రభాస్ ఆనందాన్ని ఆవిరి చేసిన నిర్మాత.. అసలేం జరిగిందో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మున్నా అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ మనీ గోవా బ్యూటీ ఇలియానా ప్రభాస్ కి జోడిగా నటించింది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించగా ... వేణు , బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా ... హరిజ్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈ సినిమా విడుదల తర్వాత జరిగిన కొన్ని విషయాలను తెలియజేశాడు. మున్నా మూవీ గురించి దిల్ రాజు మాట్లాడుతూ ... మున్నా సినిమా విడుదల అయిన రోజు నేను ఆ సినిమాను జనాలతో కలిసి థియేటర్లో చూశాను. నాకు ఎక్కడో ఆ సినిమా జనాలకు కనెక్ట్ కావడం లేదు అనే విషయం అర్థమైంది. దానితో ఆ సినిమా పోతుంది అనే విషయం కూడా నాకు తెలిసిపోయింది.

ఇదే విషయం ప్రభాస్ కి చెబుదాం అని ఆయన ఇంటికి వెళ్లాను. అప్పటికే ఆయన సినిమా బ్లాక్ బస్టర్ అని అతని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక నన్ను చూసి నా దగ్గరికి వచ్చాడు. దానితో నేను సినిమా పెద్ద సక్సెస్ కాదు అన్నాను. ఇక ఆయన అందరూ హిట్ అంటున్నారు కదా అన్నాడు. అది రాంగ్ రిపోర్ట్ సినిమా మహా అయితే బిలో యావరేజ్ అవుతుంది అంతకు మించి ఏమీ జరగదు అన్నాను. అదే జరిగింది అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: