ఆ హీరోయిన్ బయోపిక్ లో కృతి శెట్టి..బేబ్బమ్మ ఇంత రిస్కీ ప్రాజెక్ట్ ఓకే చేసింది ఏంటి..?

Thota Jaya Madhuri
హీరోయిన్స్ బయోపిక్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెరకెక్కుతున్నాయి . మరీ ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరోయిన్ కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలి అని చాలామంది అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరోయిన్ బయోపిక్ తెరకెక్కించండి అంటూ పలువురు డైరెక్టర్స్ కి ట్వీట్టర్ వేదికగా ట్విట్స్ చేస్తున్నారు . మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు . కాగా ఎప్పటినుంచో తెరకెక్కితే బాగుండు అనుకుంటున్న ఒక హీరోయిన్ బయోపిక్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.


ఆ బ్యూటీ మరెవరో కాదు "ప్రత్యూష".  ఆమె పేరు చెప్తే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి.  చాలా చిన్న ఏజ్ లోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది.  ప్రత్యూష ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . బడా బడా హీరోలు కూడా ఆమెను తమ  సినిమాలో పెట్టుకోవడానికి ట్రై చేశారు . అంతటి ఒక క్రేజీ స్దానాన్ని అందుకుంది ఈ బ్యూటీ. కానీ ప్రత్యూష ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ తన కెరీర్ ని పక్క ప్లాన్ తో ముందుకు తీసుకెళ్లింది.


అయితే ప్రత్యూష లైఫ్ లో కొందరిని గుడ్డిగా నమ్మడం కారణంగా ప్రాబ్లమ్‌స్ ఫేస్ చేసింది. ఆమె  మరణం గురించి అందరికీ తెలిసిందే . ప్రత్యూష మరణంలో పెద్దపెద్ద పొలిటిషియన్స్ హస్తం ఉంది అంటూ ఇప్పటికి టాక్ నడుస్తుంది . అలాంటి హీరోయిన్ బయోపిక్ రావాలి అని.. అసలు నిజానిజాలు బయటకు తేవాలి అని చాలామంది ఫాన్స్ కోరుకున్నారు. ఎప్పటినుంచో ఈ చర్చ జరుగుతుంది. ఫైనల్లీ ప్రత్యూష బయోపిక్ సెట్స్  పైకి రాబోతున్నట్లు తెలుస్తుంది . అయితే ఇందులో హీరోయిన్గా కృత శెట్టిని చూస్ చేసుకున్నారట మేకర్స్. చాలా మంది ప్రత్యూష బయో పిక్ ని రిజెక్ట్ చేశారు. కానీ కృతి శెట్టి మాత్రం అందుకు ఓకే చేసిందట.  ఇది నిజంగా చాలా రిస్కీ ప్రాజెక్టు. ఎలా ఓకే చేసిందో అర్థం కావడం లేదు . ఇలాంటి ప్రాజెక్ట్స్ లో నటిస్తే నైనా తన నటన టాలెంట్ జనాలు గుర్తిస్తారు అనుకొనిందో ఏమో ..? మొత్తానికి పెద్ద రిస్కే చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: