ప్రభాస్ కోసం ఎదురుచూశా.. చివరకి తారక్ తో చేశా.. సురేంద్రరెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

murali krishna
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి  ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.. అయితే గత కొంత కాలంగా సురేందర్‌రెడ్డికి అదృష్టం కలిసి రావడం లేదు ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో దర్శకుడు సురేందర్‌రెడ్డి నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేనితో ‘ఏజెంట్’ అనే భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేసాడు.. దాదాపు ఏడాది పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా అతి దారుణంగా ప్లాప్ అయింది.. ఈ సినిమా ఫలితం ఎలా వుంది అంటే ఇప్పటికీ ఈ సినిమా ఓటిటి డీల్ చేసుకునేందుకు సదరు ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ భయపడేంతగా ఆ సినిమా పరిస్థితి మారింది.. దీనితో ఎన్నడూ లేని విధంగా ఆ సినిమా తరువాత దర్శకుడు, నిర్మాత, హీరో బయట కనిపించడమే మానేశారు.. అయితే గతంలో సురేందర్‌రెడ్డి అంటే మినిమం ఎక్సపెక్ట్ చేసి ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చేవారూ..

’అతనొక్కడే' సినిమాతో దర్శకుడిగా సురేందర్‌రెడ్డి కెరీర్ మొదలైంది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు క్యూ కట్టాయి. ఇందులో భాగంగానే సురేందర్‌రెడ్డికి ప్రభాస్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చిందట. దీనిపై ఓ ఇంటర్వ్యూలో అడగ్గా సురేందర్‌రెడ్డి అవుననే సమాధానం కూడా ఇచ్చారు.అవును నా రెండో చిత్రం ప్రభాస్‌తో తీయాలనుకున్నా. కానీ, అది కుదరలేదు. 'అతనొక్కడే' విజయం తర్వాత నాకు బాగా అవకాశాలు వచ్చాయి. అయితే, అప్పటికే ప్రభాస్‌తో సినిమా చేద్దామని నేను అన్నీ సిద్ధం చేసుకున్నా. అదే సమయంలో తారక్‌తో సినిమా చేయాలని ఓ వ్యక్తి నన్ను కోరడం జరిగింది.. ఆయన మాట కాదనలేక సినిమా చేయడానికి ఒప్పుకున్నాను... అప్పటికే ఎన్టీఆర్‌ స్టార్‌ హీరోగా ఉండటంతో సినిమా ఒప్పుకోక తప్పలేదు.అలా చేసిన సినిమానే  'అశోక్‌'. కానీ ఈ సినిమా ప్లాప్ అయింది..అయితే సురేందర్‌రెడ్డి ప్రభాస్‌తో తీద్దామనుకున్న కథ వేరు..ముందే సిద్ధం అయిన కథను చిన్న చిన్నమార్పులతో తెరకెక్కించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: