జానీ మాస్టర్ పై కేసు పెట్టించింది సుకుమారే.. బన్నీ పాత్ర కూడా.. అసలు నిజం బయటపెట్టిన నిర్మాత..?

Pandrala Sravanthi
జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీలో రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈయన కు వచ్చిన నేషనల్ అవార్డును సైతం తాత్కాలికంగా నిలిపివేశారు.అలాగే బెయిల్ కూడా కొట్టివేశారు.తాజాగా కూడా బెయిల్ కి అప్లై చేస్తే బెయిల్ ని కోర్టు తిరస్కరించింది. దాంతో మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు జానీ మాస్టర్. అయితే జానీ మాస్టర్ వ్యవహారం పై నిర్మాత నట్టి కుమార్ ఆయనకి మద్దతు తెలుపుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా జానీ మాస్టర్ కి సంబంధించి ఓ సంచలన విషయం బయటపెట్టారు నట్టి కుమార్. ఆయన ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డైరెక్టర్ సుకుమారే ఈ పనంతా చేయించారు.. ఎందుకంటే జానీ మాస్టర్ జనసేన పార్టీ లో చేరిక కోసం బిజీబిజీగా తిరుగుతున్న సమయంలో సుకుమార్ వచ్చి ఓ హీరో కోసం కొరియోగ్రాఫర్ గా పని చేయాలని చెప్పారు. కానీ జానీ అదంతా కుదరదని చెప్పడంతో ఆయన అసిస్టెంట్ ని పాట కోసం తీసుకున్నారు. కానీ కొరియోగ్రాఫర్లు తమ దగ్గర అసిస్టెంట్ గా చేసే వారిని తీసుకుంటే అస్సలు ఒప్పుకోరు. ఈ విషయంలో జానీ మాస్టర్ కూడా ఒప్పుకోక సుకుమార్ ముందే ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు ఇలా చేయడానికి ఒప్పుకున్నావు అని గొడవ చేశారు. 

ఆ సమయంలో సుకుమార్ ఆ అమ్మాయికి మద్దతు తెలిపారు. ఇక ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అలాగే ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసిన సమయంలో యాంకర్ ఝాన్సీ చాలా ఓవరాక్షన్ చేసింది. ఈ విషయాన్ని సుకుమార్ భరద్వాజ్ కు చెప్పడంతో ఆయన ఏ విషయం తెలియకుండానే జానీ మాస్టర్ దోషి అని తేలకుండానే జానీ కార్డ్ తొలగించి  ప్రెస్ మీట్ పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఇందులో అల్లు అర్జున్ పాత్ర కూడా ఏమీ లేదు.కానీ ఆ హీరో పేరును కూడా ఇందులో తీసుకువచ్చారు. ఇందులో బన్నీ తప్పేమీ లేదు..ఇక సుకుమార్ ముందు అంత గొడవ జరగడంతో ఆ విషయంలో జానీదే తప్పు అని ఆ అమ్మాయికి సుకుమార్ మద్దతుగా నిలిచి భరద్వాజ్ కి ఫోన్ చేసి ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వండి అని సుకుమార్ స్వయంగా చెప్పారు.కానీ ఆ అమ్మాయితో గత సంవత్సరం నుండే జానీ మాస్టర్ దూరం దూరంగా ఉంటున్నారు. ఆ సమయంలోనే ఆ అమ్మాయికి జానీ మాస్టర్ ప్రాపర్టీ లపై కన్ను పడింది. అంతేకాదు మొదటి భార్య పిల్లల్ని వదిలేసి తనని పెళ్లి చేసుకోమని గోలగోల చేసింది.

 దాంతో  జానీ మాస్టర్ మొదటి భార్య ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి కొట్టిందో లేదో నాకు తెలియదు.కానీ ఇంటికి వెళ్లి మాత్రం మందలించింది. ఇక ఆ అమ్మాయిని జానీ మాస్టర్ మొదటి భార్య కొట్టిన తప్పేమీ లేదు.ఎందుకంటే భర్తని వేరే అమ్మాయి లాక్కుంటే ఏ భార్య చేతులు ముడుచుకొని ఉండదు. ఒకవేళ జానీ మాస్టర్ మొదటి భార్య కొట్టి ఉంటే అది కరెక్టే.ఇక ఆ అమ్మాయి జానీ మాస్టర్ పై పగబట్టి ఎలాగైనా ఇరికించాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తన అడ్వకేట్ కి 36 పేజీల సబ్జెక్టు ఇవ్వడంతోనే అసలు జానీ మాస్టర్ దోషి అవునో కాదో తెలియక ముందే మీడియాలో రచ్చరచ్చ చేశారు. ఈ విషయాలన్నీ త్వరలోనే బయటపడతాయి. ఇందులో అసలు దోషి ఎవరో త్వరలోనే బయటపడబోతున్నారు అంటూ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు జానీ మాస్టర్ తో తను ఇప్పటివరకు ఎలాంటి సినిమా చేయలేదు. కానీ ఇండస్ట్రీలో ఉండే ఓ వ్యక్తిపై ఇంత కుట్ర జరుగుతుంటే సైలెంట్ గా ఉండలేక ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటూ కూడా నట్టి కుమార్ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: