వార్నీ.."జిగేలు రాణి" పాటను సుక్కు ఆ బ్యూటితో చేయాలి అనుకున్నాడా..? ఒప్పుకొని ఉంటే నరాళ్లు కట్ అయిపోయుండేవిగా..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ సుకుమార్ కు ప్రత్యేక స్థానం ఉంది. అఫ్కోర్స్ అందరిలాగే మంచి మంచి కథలను తెరకెక్కిస్తాడు . కానీ సుకుమార్ ప్రతి సినిమాలోను ఒక పాటను చాలా స్పెషల్ గా డిజైన్ చేస్తాడు . ఎంతలా అంటే ఆ సినిమాలో వర్క్ చేసిన హీరో హీరోయిన్ల కన్నా ఆ పాటలో నటించిన బ్యూటీ నే బాగా హైలైట్ అవుతూ ఉంటుంది . ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో ప్రతి ఒక్క మూవీలోను ఆ స్పెషల్ సాంగ్ హైలెట్గా మారడం మనం చూస్తూనే వచ్చాం.


మరీ ముఖ్యంగా ఆర్య సినిమాలో "ఆ అంటే అమలాపురం".. అదేవిధంగా ఆర్య 2 లో "రింగ రింగా".. అదేవిధంగా రంగస్థలం సినిమాలో "జిగేల్ రాణి".. పుష్ప సినిమాలో "ఊ అంటావా మావ".. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో. సుకుమార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అయితే సుకుమార్ జిగేలురాణి విషయంలో మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ గా ఫీల్ అవ్వలేదట . దానికి కారణం ఆ సాంగ్ లో పూజా హెగ్డే కన్నా ముందు వేరే ఒక హీరోయిన్ తో చిందులు వేయించాలి అని డిసైడ్ అయ్యారట.


రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "రంగస్థలం". ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో జిగేలురాణి పాట ఇంకా హైలైట్ గా మారింది. ఈ పాట కోసం పూజా హెగ్డే బాగా కష్టపడింది . అయితే ఈ పాట కోసం ముందుగా కీర్తి సురేష్ ను అనుకున్నాడట సుకుమార్ . కరెక్ట్ గా ఇంటికి వెళ్లి మరీ ఆమెకు రిక్వెస్ట్ చేశాడట . కానీ కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ లో నటించను అంటూ తెగ్గేసి చెప్పేసిందట. ఆమె ఒపీనియన్ ని మారుద్దామని చాలా ట్రై చేసాడట . కానీ కీర్తి అందుకు ఒప్పుకోలేదుట . ఇక చేసేది ఏమీ లేక నెక్స్ట్ ఆప్షన్ లో ఉన్న పూజా హెగ్డే తోనే ఆ పాటను చిత్రీకరించారట . పాట మాత్రం హైలెట్గామారి సినిమాకే స్పెషల్ గా నిలిచింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: