సాయి పల్లవి తో ఆ సీన్ చేయడం ఇష్టం లేక..ఆ బ్లాక్ బస్టర్ మూవీనే క్యాన్సిల్ చేసుకున్న మహేష్ బాబు..!

Thota Jaya Madhuri
సాధారణంగా స్టార్ హీరోస్ అయ్యాక ..స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాక కచ్చితంగా కొంతమంది హీరోస్ పలు సీన్స్ లో నటించము అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . కానీ మన తెలుగు హీరోలు మాత్రం అలా చేసే ఛాన్స్ చాలా చాలా తక్కువ . మోస్ట్లీ అలాంటి కండిషన్స్ పెట్టరు . డైరెక్టర్ ఎటువంటి సీన్స్ చెప్పిన సరే జనాలను ఎంటర్టైన్ చేయడానికి అలాంటి సీన్స్ లో నటిస్తూ ఉంటారు . కానీ కొన్ని కొన్ని సార్లు కొందరు హీరోలు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సినిమాలను కొన్ని సీన్స్ చేయలేక వదులుకోవాల్సి వస్తుంది .


ఆ లిస్టులోకి వస్తాడు మహేష్ బాబు . మొదటి నుంచి మహేష్ బాబు చాలా చాలా సైలెంట్. తనను తన ఫ్యాన్స్ హర్ట్ చేసే సీన్స్ లో అసలు నటించడు.  ఆ విషయం చాలామందికి తెలుసు. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం మహేష్ బాబు తన అంతటికి తానే ఆ సీన్ లో నటించడం ఇష్టం లేక .. ఆ మూవీ ని రిజెక్ట్ చేశాడట . ఆ సినిమా మరేదో కాదు "ఫిదా". శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అన్న విషయం మనందరికీ బాగా తెలుసు .


ఆ సినిమా ఇప్పటికి టీవీలో వస్తే ఫ్యాన్స్ అలాగే జనాలు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు . ఈ సినిమాలో మొదటిగా మహేష్ బాబునే  హీరోగా అనుకున్నాడట శేఖర్ కమ్ముల . అయితే కథా కాన్సెప్ట్ బాగున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించినా కూడా ఈ సినిమాను ఓకే చేశాడట . కానీ ఒకానొక సీన్ లో తెల్లవారుజామున టవల్ కట్టుకొని బావి దగ్గర చల్లనీళ్ళతో స్నానం చేయాలి అని చెప్పడంతో మహేష్ బాబు ఆ సీన్ చేయడానికి ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడట . మహేష్ బాబు ఏ సినిమాలో కూడా షర్ట్ లేకుండా కనిపించడు .. ఎక్కడో అలాంటిది రేర్ గా చూస్తాము.  అలాంటిది అందరి ముందు టవల్ కట్టుకుని స్నానం చేయండి అంటే మహేష్ బాబు ఒప్పుకుంటాడా.. నో వే. ఆ సీన్ చేయలేక ఈ సినిమాను వదులుకున్నాడట . ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆ విషయం బయటపడింది . ప్రెసెంట్ మహేష్ బాబు .. రాజమౌళి తో సినిమా కోసం కష్టపడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: