తల్లి చివరి కోరిక తీర్చలేకపోయినా మహేష్ బాబు.. ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతున్నాడా..?

Thota Jaya Madhuri
మహేష్ బాబు ..ఫ్యామిలీ కోసం ఎలాంటి రిస్క్ అయిన చేస్తూ ఉంటాడు. ఫ్యామిలీ కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు.  ఆ మాటకొస్తే మన ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నది మహేష్ బాబును చూసే . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు తన కుటుంబానికి చాలా చాలా వాల్యూ ఇస్తాడు .. అదేవిధంగా టైం స్పెండ్ చేస్తాడు .


కనీసం సంవత్సరానికి ఆరుసార్లు అయినా సరే ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తూ ఉంటారు . ఆ విషయం మనందరికీ తెలుసు . అలాంటి మహేష్ బాబు తన తల్లి ఇందిరమ్మ చివరి కోరిక తీర్చలేకపోయాడు . ఆ విషయంలో ఇప్పటికీ మహేష్ బాబు బాగా బాధపడుతూ ఉంటాడట . మహేష్ బాబు తల్లి ఇందిరమ్మ ఏడాది ముందు మరణించింది . గుంటూరు కారం సినిమా షూటింగ్ టైంలో ఇందిరమ్మ అనారోగ్య కారణంగా మరణించింది . ఆ టైంలో చాలామంది సినీ ప్రముఖుల మహేష్ బాబును ఓదార్చరు .


ముఖ్యంగా సితార బాధను చూసి టాలీవుడ్ మొత్తం తలడిల్లిపోయింది. అయితే తల్లి అంటే మొదటి నుంచి చాలా రెస్పెక్ట్ ఇచ్చే మహేష్ బాబు తన తల్లి చివరి కోరిక మాత్రం తీర్చలేకపోయాడట. సితారకు ఓణీల ఫంక్షన్ చేస్తే చూడాలి అంటూ తెగ ఆశపడిందట ఇందిరమ్మ.  కానీ మొదటి నుంచి అలాంటి ఫంక్షన్స్ ఎంకరేజ్ చేయని ఇష్టపడని మహేష్ బాబు సితారకు అలాంటి ఫంక్షన్ చేయడానికి ఇష్టపడలేదట . తల్లి ఎంత చెప్పినా కూడా అలాంటి ఫంక్షన్ చేయను అంటుగా మొండిగా బీహేవ్ చేశారట. ఆ తర్వాత తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది . అప్పుడు మహేష్ బాబు చాలా చాలా బాధపడ్డారట . తల్లి చివరి కోరిక తీర్చలేకపోయాను అంటూ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: