గేమ్ ఛేంజర్ కు ముందు అనుకున్న హీరో ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali krishna
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్  " గేమ్ ఛేంజర్" సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారని గతంలో దిల్ రాజు ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమా షూట్స్ నుంచి లీక్ అయిన కొన్ని పిక్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం.తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ చంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ శంకర్ నాకు మొదట 45 నిమిషాల కథ వినిపించారు. పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా తీద్దాం అనుకున్నారు ఆయన. అదే నాకు చెప్పారు. కానీ ఈ కథకు చరణ్ సూట్ అవుతాడు అనిపించి నేనే చరణ్ ని సజెస్ట్ చేశాను. అయన కూడా ఒప్పుకోవడంతో ఈ సినిమా మొదలైంది అని తెలిపారు.రామ్ చరణ్ ఆ సమయంలో ‘RRR’ షూట్ లో ఉంటె నేను వెళ్లి కలిసి శంకర్ ఇలా లైన్ చెప్పారు విను అని చెప్పి శంకర్ తో కథ చెప్పించాను. చరణ్ ఒకే చెప్పడంతో గేమ్ ఛేంజర్ అలా స్టార్ట్ అయింది ” అని అన్నారు. ఒకవేళ పవన్ కళ్యా ణ్ నటించి ఉంటె ఎలా ఉండేదో రిలీజ్ అయితే కానీ తెలియదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా పవన్ తో తీద్దామంటే చరణ్ ని సజెస్ట్ చేశానని చెప్పడంతో పవన్ అభిమానులు దిల్ రాజుని ట్రోల్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ తో, కొత్త కథతో, పాన్ ఇండియా సినిమా పవన్ కి లేకుండా చేశావు, పవన్ అడిగితే చేసేవాడు కదా, పవన్ కి మంచి సినిమా మిస్ చేశావు.. అంటూ సోషల్ మీడియాలో దిల్ రాజుపై ట్రోల్స్ చేస్తున్నారు  మరి ఈ సంగతి చరణ్ కి తెలుసో లేదో.ఇదిలా వుండగా ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.ఇటీవల రిలీజ్ అయిన రా మచ్చ లిరికల్సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది.గేమ్ ఛేంజర్ డిసెంబరు 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: