పవన్ "బద్రి" కథను ఏ టైమ్ లో విన్నాడో తెలుసా.. షెడ్యూల్ చెప్పగానే షాక్ అయిన పూరి జగన్నాథ్..?

MADDIBOINA AJAY KUMAR
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం బద్రి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమా స్టార్ట్ కాకముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. తాజాగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చాలా కాలం నుండి ప్రయత్నిస్తూ వచ్చాను. అలా ప్రయత్నాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ పిఏ ఒక రోజు పవన్ కళ్యాణ్ రేపు ఉదయం కథ వింటాను అన్నాడు.

మీరు ఉదయం 4 గంటలకు వచ్చి కథను వినిపించండి అని అన్నాడు. నేను వెంటనే ఉదయం 4 గంటలకు కథ వింటాడా అని అన్నాను. దానితో సార్ ఉదయమే లేస్తాడు. ఆ సమయం లోనే కథ వింటాడు మీరు వచ్చి చెప్పండి అన్నాడు. దానితో నేను వెంటనే పొద్దున్నే లేచి రెడీ అయ్యి పవన్ ఇంటికి వెళ్లాను. ఇక పవన్ వచ్చాడు ... నీకు అర్థ గంట సమయం ఇస్తాను ... కథ చెప్పు అన్నాడు. దానితో నేను అర్థ గంట సరిపోదు సార్ అన్నాను. కానీ మరి నేను నీకు అర్థ గంట మాత్రమే ఇస్తున్నాను కదా అన్నాడు.

దానితో నేను నేను కథ చెబుతూ వెళ్తాను ... మీరు వింటూ ఉండండి. అది ఎంత టైమ్ అయినా పర్లేదు. మీకు కథ నచ్చలేదు అంటే నేను డోర్ తీస్తే బయటికి వెళ్లిపోతాను అని అన్నాను. దానితో పవన్ ఓకే అన్నాడు. కథ వినడం మొదలు పెట్టాడు. ఇక అలాగే కథ వింటూ ఉన్నాడు. ఉదయం 4 గంటలకు మొదలు పెట్టిన కథ ఉదయం 8 గంటలకు పూర్తి అయింది. 4 గంటల పాటు ఆయన కథ వింటూనే ఉన్నాడు అని పూరి జగన్నాథ్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: