బిగ్ బాస్ 8 : అందరూ కలిసి.. అతన్ని విన్నర్ చేసేలా ఉన్నారే?

praveen
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. మరి ముఖ్యంగా హౌస్ లోకి వెళ్ళిన వారిలో ప్రేక్షకులకు బాగా నచ్చే కంటెస్టెంట్ ఎవరు అని చెప్పడం కూడా కష్టమే. కొన్ని కొన్నిసార్లు ఏకధాటిగా ఒక్కరికే మద్దతు పలకడం చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. గత సీజన్లో ఇదే జరిగింది. ఏకంగా రైతుబిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే.

 ఒకరకంగా బిగ్ బాస్ ఓటింగ్ నే అతను శాసించాడు. దీనికి అంతటికి కారణం ఏకంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్. అందరూ కూడా రైతుబిడ్డ పల్లవి ప్రశాంతును టార్గెట్ చేయడమే. ఎప్పుడు అతని టార్గెట్ చేస్తూ పక్కన పెట్టడం.. ఆటలో అరటిపండు లాగా చూడటం చేస్తూ వచ్చారు. దీంతో బయట అతనిపై సింపతి పెరుగుతూ వచ్చింది. ఎంతలా అంటే అతని విన్నర్ చేసేంతల ఇక బయట ఉన్న ప్రేక్షకులను లోపల ఉన్న కంటెస్టెంట్స్ ప్రవర్తన తీరు ప్రభావితం చేసింది. అయితే ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్లో కూడా ఇదే జరుగుతుంది. ఏకంగా కంటెస్టెంట్స్ అందరూ మణికంఠను టైటిల్ విన్నర్ గా చేస్తారా ఏంటి అని అనుమానం కూడా కలుగుతుంది.

  మొదటినుంచి సింపతి కార్డు వాడుతూ మణికంఠ హౌస్ లో కొనసాగుతూ వస్తున్నాడు. దీంతో అతను రెండు వారాలు కూడా హౌస్ లో ఉండడం కష్టమే అని అనుకున్నారు. నాలుగు వారాలు గడిచాయి. అతను సేవ్ అవుతూనే వస్తున్నాడు. అయితే ఇలాంటి సమయంలో ఇక నాగమణికంట అటు కంటెస్టెంట్స్ తో గొడవలు పడుతూ ఉండడం.. అందరూ కలిసి అతన్ని పక్కన పెడుతూ ఉండడం ఇక ప్రేక్షకులు చూస్తూనే ఉన్నాము. అతను ఏ క్లాన్ లోకి వెళ్ళిన అతనికి కాస్తయినా.. ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు  దీంతో మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా అతని పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే అతన్ని కార్నర్ చేసేస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది. దీంతో ప్రేక్షకులు అందరూ కూడా అతనికి మద్దతుగా నిలవాలని అనుకుంటున్నారట. ఇక రానున్న రోజుల్లో కూడా ఇదే కొనసాగితే గత సీజన్లో పల్లవి ప్రశాంత్ లాగానే అటు నాగమణికంట విన్నర్ అయిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: