బాలయ్య సై అంటున్నాడు.. బాబీ నో అంటున్నాడు.. ఫ్యాన్స్ ఏమంటారో..?

murali krishna
తెలుగు ఇండస్ట్రీలో నటసింహ బాలకృష్ణ.. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్‌ జోష్ మీదున్నాడు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. సినిమాల్లో హ్యాట్రిక్‌, రాజకీయాల్లో హ్యాట్రిక్‌ సాధించిన బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. వీరి కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏమీ ఇప్పటి వరకు ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు.ఇదిలా వుండగా దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విషయంలో 10 నిమిషాలకు మించి వేస్ట్ ఫుటేజీ తీయలేదని, నిర్మాతల డబ్బుని, నటీనటుల విలువైన కాలాన్ని అతను వృధా చేయలేదని.అతను వేస్ట్ చేసింది పేపర్ల రూపంలో మాత్రమే’ అని చిరు చెప్పుకొచ్చాడు. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఫాస్ట్ గా ఫినిష్ అవ్వడం వెనుక ఇదే కారణం అని కూడా చిరు తెలిపారు. కానీ అదే పద్ధతిని బాలయ్య విషయంలో మాత్రం ఫాలో అవ్వలేకపోతున్నాడు బాబీ. ఈ మధ్య బాలయ్య ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేసే విధంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఆయనది. తన 109వ సినిమాని బాబీ డైరెక్షన్లో చేయడానికి బాలయ్య ఓకే చెప్పారు.
త్వరగా కంప్లీట్ చేసి ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ బాబీ మాత్రం తెవల్చడం లేదు. కొంత పోర్షన్ రీ షూట్ చేస్తున్నాడట. అలాగే ఈ సినిమా కథ ప్రకారం ఇంకో హీరో కూడా అవసరమట. ఆ హీరో ఇంకా సెట్ అవ్వలేదు. అతని పార్ట్ షూటింగ్ కూడా పెండింగ్ ఉంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదని టాక్.ఇదిలా వుండగా ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తూ ఉండగా మరో హీరోయిన్‌ గా ఊర్వశి రౌతేలా నటిస్తున్నట్టు సమాచారం . ఇప్పటి వరకు ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలన్నింటికి దసరా కానుకగా విడుదల అవ్వబోతున్న టైటిల్‌ తో కూడిన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ తో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి పుకార్లు కుప్పలు తెప్పలుగా షికార్లు చేస్తున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ లో నాగ వంశీ నిర్మిస్తుండగా, త్రివిక్రమ్‌ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: