పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా..హీరోయిన్‌ కూడా పనికిరాదు..?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుర్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ తన పెద్ద కూతురు ఆధ్యతోపాటు చిన్న కూతురు పలిన అంజలి కొణిదెల ఇప్పటికే తిరుమల శ్రీవారి వద్దకు చేరుకున్నారు. అయితే పలీనా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కూతురు సంతకం చేసింది. పలీనా అంజలి మైనర్ అమ్మాయి కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. పవన్‌ కళ్యాణ్‌ చిన్న కూతురు ఫోటోలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. కాగా, ఇటీవల మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హిందూ యేతరులు డిక్లరేషన్ పై సంతకం చేసాకే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిని ఇవ్వాలంటూ కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.

అయితే ఆ తర్వాత జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దు చేసుకున్నారు. ఈ వివాదం జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ తన కూతురితో డిక్లరేషన్ పై సంతకం చేయించడం, తండ్రిగా తాను కూడా సంతకం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. దీక్ష ముగింపు కోసం ఆయన తిరుమలకు చేరుకోవడం జరిగింది.

ఇవాళ శ్రీవారిని దర్శించుకుని అనంతరం దీక్ష విరమించనున్నారు. కాగా, సుమారు రెండు రోజులపాటు పవన్ కళ్యాణ్ తన కూతుర్లతో కలిసి తిరుమల కొండపైనే బసచేయనున్నారని సమాచారం. శ్రీవారి సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్ష విరమించి అనంతరం అన్నప్రసాదం, లడ్డూ తయారీ ప్రక్రియలను పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత తిరుపతిలో వారాహి సభ నిర్వహించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: