50 సెకన్స్ కు 5 కోట్లు ఛార్జి చేసిన నయనతార !

Seetha Sailaja
దక్షిణాది సినిమా రంగం సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని తల్లి అయిన తరువాత కూడ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఒక సినిమా కోసం కనీసం నాలుగు ఐదు నెలలు ఆమె కష్టపడితే ఆమెకు 5 కోట్ల పారితోషికం ఇస్తున్నారు. అయితే కేవలం 50 సెకన్స్ యాడ్ లో ఆమె నటించినందుకు 5 కోట్లు పారితోషికం తీసుకుని ఆమె టాపిక్ ఆఫ్ ది ఫిలిమ్ ఇండస్ట్రీగా మారింది.

షారూఖ్ ఖాన్ తో నటించిన ‘జవాన్’ మూవీ సూపర్ హిట్ అయిన తరువాత నయనతార 10కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు కాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ నుండి కూడ ఈమెకు అవకాశాలు బాగా వస్తున్నాయి. గతంలో హీరోయిన్స్ కు సినిమాలలో నటించినప్పుడు మాత్రమే పారితోషికం భారీ స్థాయిలో వస్తూ ఉండేది. అయితే ఇప్పుడు హీరోయిన్స్ కు హీరోలకు సినిమాలలో నటించడం వల్ల వచ్చే పారితోషికంతో పాటు యాడ్స్ లో నటించడం వల్ల ఇన్ స్టా గ్రామ్ ట్విట్టర్ లో పోస్టింగ్స్ పెట్టడం వల్ల కూడ భారీ పారితోషికాలు అందుకుంటున్నారు.

ఒక సినిమాలో నటించినందుకు దక్షిణాది సినిమా రంగంలోనే భారీ పారితోషికం తీసుకునే నయనతార ఆసినిమా ప్రమోషన్ విషయంలో ఏమాత్రం పట్టించుకోదు. కనీసం ఆమె నటించిన మూవీ ఫంక్షన్స్ కు కూడ ఆమె రాదు. అయినప్పటికీ దర్శక నిర్మాతలు ఆమె తమ సినిమాలకు సంబంధించి డేట్స్ ఇస్తే చాలు అనకుంటున్నారు. నయనతార ను ఆదర్శకంగా తీసుకుని చాలామంది హీరోయిన్స్ సినిమాలలో నటించే విషయం కంటే యాడ్స్ లో చేయడానికి బాగా ఆశక్తి కనపరుస్తున్నారు.

ఆమధ్య నయన్ కు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కు భేధాభిప్రాయాలు వచ్చాయి అంటూ కోలీవుడ్ మీడియాలో గాసిప్పులు గుప్పుమన్నాయి. అయితే దానికి చెక్ పెడుతూ ఆమె ప్రస్తుతం తన భర్త ఆమె కవల పిల్లలతో కలిసి గ్రీస్ లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: