ట్రైలర్: స్వాగ్ తో శ్రీ విష్ణు అదరగొట్టేశారుగా.. ట్విస్టులే ట్విస్టులు..!

Divya
టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోగా కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరో శ్రీ విష్ణు కూడా ఒకరు.. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు శ్రీ విష్ణు. ఇప్పుడు తాజాగా మరొక విభిన్నమైన కథ అంశంతో త్వరలోనే స్వాగ్ తన చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హసీత్ గోలి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా రీతు వర్మ నటించగా కీలకమైన పాత్రలలో మీరాజాస్మిన్, సునీల్, దాక్షానగర్కర్ , గెటప్ శ్రీను తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు.
మొదటినుంచి ఈ సినిమాకి మంచి హైప్ తీసుకువచ్చేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే పలు రకాల కార్యక్రమాలలో కూడా ప్రమోషన్స్లో పాల్గొంటూ వచ్చింది. ఇందులో భాగంగా ఈ రోజున గడిచిన కొన్ని గంటల క్రితం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. స్వాగ్ ట్రైలర్ విషయానికి వస్తే.. మొన్ననే ఫ్రెంచ్ యువరాణిని ఏకాంతంగా కలిశాను అని చెప్పే డైలాగ్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. మరొకసారి శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తున్నారు.

ఈ సినిమా అటు రాజుల కాలం నాటి, ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి తగ్గట్టుగా విభాగాలుగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. 1951 లో ఈ సినిమా కథ మొదలై ఇప్పటివరకు జరగబోయే విషయాలను కూడా ట్రైలర్లు చూపించినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా పురుషాధిక్యం ఎక్కువగా ఉన్నట్టుగా ఈ సినిమా కథలో హైలైట్ గా చేశారు. మొత్తానికి ట్రైలర్ తోనే స్వాగ్  సినిమాని  హైలెట్ చేసిన చిత్ర బృందం.. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో కొన్ని ట్విస్టులను కూడా చూపించినట్టుగా కనిపిస్తోంది. మరి ఏ మేరకు ఈసారి శ్రీ విష్ణు అభిమానులను మెప్పిస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: