టాలీవుడ్ ను షేక్ చేస్తున్న కోలీవుడ్ రీ రిలీజ్ మూవీస్.. లిస్టులోకి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్..?

Pulgam Srinivas
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీస్ల జోరు బాగా పెరిగిపోయింది. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏదైనా హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆ హీరోకు సంబంధించిన సినిమాలను రీ రిలీస్ చేస్తున్నారు. ఆ మూవీలకి కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు రీ రిలీజ్ మూవీలను బాగా ఇష్ట పడుతూ ఉండడంతో తమిళ మేకర్స్ కూడా టాలీవుడ్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో వరస పెట్టి కోలీవుడ్ సినిమాలను తెలుగులో రీ రిలీస్ చేస్తున్నారు.
 

అందులో భాగంగా కొంత కాలం క్రితం సూర్య హీరోగా రూపొందిన సూర్య సన్నాఫ్ కృష్ణ సినిమాని తెలుగులో రీ రిలీస్ చేశారు. ఈ మూవీ కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో భాగంగా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. కొన్ని రోజుల క్రితమే ధనుష్ హీరోగా రూపొందిన 3 మూవీ ని కూడా తెలుగులో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా ఇప్పటికే రీ రిలీజ్ లో భాగంగా ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం శింబు హీరోగా జ్యోతిక హీరోయిన్గా మన్మధ అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తెలుగు లో విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాను కూడా తెలుగులో రీ రిలీస్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను అక్టోబర్ 5 వ తేదీన రీ రిలీస్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఈ పోస్టర్ను కూడా విడుదల చేశారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: