తిరుమల లడ్డూ అంటేనే వణికిపోతున్న హీరో..వీడియో వైరల్‌ ?

Veldandi Saikiran
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తి వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.  అయితే అలాంటి తిరుమలా లడ్డు వివాదం పై తమిళ స్టార్ హీరో కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం లడ్డు టాపిక్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూలో... జంతువుల కొవ్వు కలిపారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.  ఎక్కడ చూసినా తిరుమల శ్రీవారు లడ్డు వివాదం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ హిందూ సంస్థలు అలాగే... రాజకీయ పార్టీల నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు.
 
అయితే లడ్డు వివాదం తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న నేపథ్యంలో... హీరో కార్తీక్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. హీరో కార్తీ తాజాగా నటించిన సినిమా సత్యం సుందరం. అయితే ఈ సినిమా రెండు రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్... హీరో కార్తీక్ ను ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. అంతేకాదు లడ్డు టాపిక్ కూడా యాంకర్ అడగడం జరిగింది.
 
యాంకర్ లడ్డు టాపిక్ తీయగానే వెంటనే రియాక్ట్ అయ్యారు తమిళ హీరో కార్తీక్. ప్రస్తుతం లడ్డు టాపిక్ అస్సలు మాట్లాడుకోకూడదని ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా లడ్డు టాపిక్ సెన్సిటివ్గా మారిపోయిందని... ఇలాంటి సమయంలో దాని గురించి తక్కువ మాట్లాడడం బెటర్ అని వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు గురించి మాట్లాడితే... హీరో కార్తీక్ పై తిరుగుబాటు... తప్పదని ఆయన భావించి ఉంటారు.. అందుకే సైలెంట్ గా ఆ టాపిక్ ను డైవర్ట్ చేసి ఉంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: