Oscar 2025: టాలీవుడ్ నుంచి ఆస్కార్ బరిలో మూడు చిత్రాలు.. ఏవంటే..?

Divya
ప్రపంచవ్యాప్తంగా సినీ సెలబ్రెటీలు కూడా తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు పొందాలని  కోరుకుంటూ ఉంటారు. గత ఏడాది రాజమౌళి తెరకెక్కించిన rrr చిత్రం కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును గెలుచుకోవడం జరిగింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా దేశమంతట పేరు వినిపించింది. అయితే ఈ ఏడాది కూడా ఆస్కార్ ఎంట్రీ ఓపెన్ కాగానే చాలా భాషల నుంచి పలు చిత్రాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలా ఈసారి మూడు తెలుగు సినిమాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాలు ఆస్కార్ లెవల్లో సత్తా చాటుతాయా అని కూడా ప్రేక్షకులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

97వ ఆస్కార్ అవార్డ్ నామినేషన్ కి ప్రస్తుతం రంగం సిద్ధమయ్యింది.. 2025 మార్చి 2న జరగబోయే ఈవెంట్ కి సంబంధించి చాలా దేశాల నుంచి వారు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. చాలా దేశాల నుంచి సినిమాలు కూడా ఆస్కార్ బరిలో నిలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర సమాచారం, పౌర సంబంధాలకు సంబంధించిన శాఖ అలా వచ్చిన వాటిని స్క్రీనింగ్ చూసి పలు భాష చిత్రాలను ఎంపిక చేయడం జరుగుతుందట. తెలుగు మలయాళం, కన్నడ, తమిళ్ ,హిందీ ,మరాఠీ, బెంగాలీ వంటి భాషలకు చెందిన చిత్రాలు కూడా ఆస్కార్ బరిలో నిలువబోతున్నాయి.

వైరల్ గా మారుతున్న సమాచారాన్ని బట్టి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ,ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన  కల్కి సినిమా.. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సినిమా.. అలాగే డైరెక్టర్ అజయ్ భూపతి, పాయల్ కాంబినేషన్లో వచ్చిన మంగళవారం సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలవబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇవి కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రాలు.. ఇతర భాషలలో నుంచి కూడా చాలా చిత్రాలే ఆస్కార్ బరిలో పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆస్కార్ అవార్డు ఎవరిని వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: