పవన్‌ కళ్యాణ్‌ పైకి కత్తులు దూస్తున్న విజయ్ దేవరకొండ..?

Veldandi Saikiran
మెగా హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే... మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ సినిమా రెండు పార్టులతో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. ఓజి సినిమాను రూ. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నారు.

ఈ సినిమాకు దాదాపు రూ. 1000 కోట్ల కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు ప్రొడ్యూసర్లు.  అలాగే రూ. 200 వందల కోట్లతో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ పార్ట్ సినిమాను తీస్తున్నారు. రూ. 150 కోట్లతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నారు. ఈ సినిమాలపై కనీసం రూ. 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయని ఆశ పడుతున్నారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే సంవత్సరం మార్చి 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఈరోజు నుంచి విజయవాడలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. విజయవాడలో ఇప్పటికే సినిమాకు సంబంధించిన సెట్ లు సిద్ధం చేశారు. ఈరోజు ఉదయం ఏడు గంటలకు షూటింగ్ లాంఛనంగా మొదలుపెట్టారు. హైదరాబాద్, విజయవాడ షటిల్ సర్వీస్ చేసే పని లేకుండా బెజవాడలోనే సినిమా షూటింగ్ తీస్తున్నారు. ఇది ఇలా ఉండగా... విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వీడి 12 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. సౌత్ ఇండియా టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టులో భాగం అవనున్నారు. అయితే ఈ సినిమా కూడా మార్చి 28వ తేదీన రిలీజ్ కానుంది. అంటే పవన్ కళ్యాణ్ తో విజయ్ దేవరకొండ ఫైట్ చేయబోతున్నాడు. మరి వీరిద్దరి సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: