నేను జాయిన్ అయ్యేసరికి మహేష్ మూవీ పనైపోయింది.. అందుకే అలాంటి రిజల్ట్.. దిల్ రాజు..?

MADDIBOINA AJAY KUMAR
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు. కొన్ని సంవత్సరాల క్రితం వీరి కాంబోలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వచ్చింది. ఈ మూవీ లో మహేష్ బాబు తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా హీరోగా నటించాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ జోడీగా అంజలి నటించగా , మహేష్ బాబు కు జోడిగా సమంత నటించింది. ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

కొంత కాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా గురించి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ ... మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి మూవీ వేరే నిర్మాతలతో ఓకే అయ్యింది. వారు అనుకోని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత నేను ఆ సినిమాలో జాయిన్ అయ్యాను.

నేను సినిమాలో జాయిన్ అయ్యే సరికి ఆ సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని పనులు అన్నీ పూర్తయ్యాయి. నేను చివరి నిమిషంలో ఆ మూవీ లో జాయిన్ అయ్యాను. కాకపోతే ఆ సినిమా కథ బాగుంది అనే నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత దానిని బాగా విడుదల చేసాం. ఆ మూవీ మంచి సక్సెస్ అయ్యింది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇకపోతే మహర్షి సినిమా తర్వాత దిల్ రాజు ,  మహేష్ బాబు హీరోగా మరో మూవీ ని ప్లాన్ చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: