టాలీవుడ్ రసికరాజా.. త్రివిక్రమ్ చేతిలో ఇంత మంది హీరోయిన్లు బలయ్యారా..?

Pandrala Sravanthi
- టాలీవుడ్ రసిక రాజాగా త్రివిక్రమ్..
- త్రివిక్రమ్ చేతిలో బలైన హీరోయిన్లు..
- కొత్త హీరోయిన్లే త్రివిక్రమ్ టార్గెట్టా..?

 నువ్వే నువ్వే మూవీ తో మొదటిసారి దర్శకుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు త్రివిక్రమ్.ఈయన అంతకుముందే కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు. అలా త్రివిక్రమ్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు ఈయన సినిమాలోని డైలాగ్స్ కూడా ఎంతోమందిని ఆకర్షించేవి. అలా మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ పై ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటినుండి ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది.అదేంటంటే త్రివిక్రమ్ తన సినిమాలో చేసే హీరోయిన్స్ చాలామందిని వాడుకున్నారని,వారితో ఎఫైర్ పెట్టుకుంటారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.మరి ఇంతకీ ఇప్పటివరకు త్రివిక్రమ్ చేతిలో ఎంత మంది హీరోయిన్లు బలయ్యారో ఇప్పుడు చూద్దాం..
గురూజీ రాసలీలలు:


 తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుంది అంటే మినిమం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.అయితే అలాంటి త్రివిక్రమ్ పై ఓ రూమర్ కూడా ఉంది.ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లతో త్రివిక్రమ్ కి ఎఫైర్ వార్తలు వినిపించాయి.ముందుగా జల్సా సినిమా చేసిన సమయంలో సెకండ్ హీరోయిన్గా చేసిన పార్వతి మెల్టన్ ని త్రివిక్రమ్ వాడుకున్నారనే టాక్ వినిపించింది. అంతకుముందే పూనమ్ కౌర్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయినప్పటికీ పార్వతి మెల్టన్ తో ఉన్న రిలేషన్ కారణంగానే పూనమ్ కౌర్ ని తప్పించి పార్వతి మెల్టన్ ఈ మూవీలో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత పార్వతి మెల్టన్ కి అవకాశాలు వచ్చేలా చేసింది కూడా త్రివిక్రమే అనే టాక్ వినిపించింది.ఇక పార్వతి మెల్టన్ సైడ్ అయ్యాక సమంత పేరు త్రివిక్రమ్ తో వినిపించింది.. నితిన్ హీరోగా చేసిన అఆ మూవీలో సమంత హీరోయిన్గా చేసింది. ఈ సినిమాకి దర్శకుడు అయిన  త్రివిక్రమ్ సమంతతో డేటింగ్ చేస్తున్నాడు అనే టాక్ ఇండస్ట్రీలో గుప్పు మంది.ఇక  ఆ తర్వాత కొద్ది రోజులకే నాగచైతన్య తో సమంత ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఈ వార్తలు ఆగిపోయాయి.

ఇక సమంత తర్వాత నెక్స్ట్ ప్రణీత సుభాష్ పేరు కూడా ఇండస్ట్రీలో వినిపించింది. అత్తారింటికి దారేది సినిమా చేసే సమయంలో ప్రణీత సుభాష్ త్రివిక్రమ్ మధ్య కొన్ని గాసిప్స్ టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వినిపించాయి. అంతేకాదు త్రివిక్రమ్ ని ప్రణీత ప్రైవేట్ ఫొటోస్ చూపెట్టి బెదిరించిందని,దాంతో త్రివిక్రమ్ 3 కోట్లు ఇచ్చి ప్రణీత మ్యాటర్ సెటిల్ చేశారని కొంతమంది ఇండస్ట్రీ జనాలు గుసగుసలు పెట్టుకున్నారు. ఇక మరో హీరోయిన్ పూజ హెగ్డే..ఎన్టీఆర్ హీరోగా చేసిన అరవింద సమేత మూవీలో హీరోయిన్గా చేసిన పూజ హెగ్డే తో కూడా త్రివిక్రమ్ కి ఎఫైర్ వార్తలు వినిపించాయి. ఇక అనూహ్యంగా పూజ హెగ్డే పేరు పక్కన పెట్టి సడన్ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ పేరు తెరపైన వినిపించింది. సార్ మూవీతో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న సంయుక్త మీనన్ అంతకుముందే పవన్ చేసిన భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా చేసింది. ఇక ఈ అవకాశం సంయుక్త మీనన్ కి త్రివిక్రమే ఇప్పించారనే తెలుస్తోంది. అలా సంయుక్త మీనన్ తో త్రివిక్రమ్ క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలు కూడా మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇలా చాలామంది హీరోయిన్లు త్రివిక్రమ్ చేతిలో బలయ్యారని,ఆయన మాటల మాంత్రికుడు గానే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో రసికరాజాగా కూడా పేరు తెచ్చుకున్నారని కొంతమంది ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటారు.
 పూనమ్ త్రివిక్రమ్ ల ఇష్యూ:
 టాలీవుడ్లో త్రివిక్రమ్ పై ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా బయటికి వచ్చి ఫిర్యాదు చేసింది లేదు. కానీ పూనమ్ కవర్ మాత్రం ఫస్ట్ టైం త్రివిక్రమ్ పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. అంతే కాదు గతంలోనే ఈమె త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు ఈమెను పట్టించుకోలేదని,ఈ మధ్యనే ఆవేదన వ్యక్తం చేసింది.ఇక సమయం దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ ని పూనమ్ కౌర్ టార్గెట్ చేస్తూనే ఉంటుంది.ఇక ఎన్నిసార్లు త్రివిక్రమ్ ని టార్గెట్ చేసిన కూడా ఆయన నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో నిజంగానే పూనమ్ కౌర్ కి త్రివిక్రమ్ ఏదో అన్యాయం చేశారని అందరూ భావిస్తున్నారు. మరి జానీ మాస్టర్ లాగే త్రివిక్రమ్ కి సంబంధించిన ఏదైనా మ్యాటర్ కూడా పూనమ్ కౌర్ బయట పెడుతుందా.. లేదా ఇలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పబ్బం గడుపుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: