నాగబాబుకు చుక్కలు చూపెట్టిన హీరోయిన్.. నీకు కూతురు లేదా అంటూ..?

Pandrala Sravanthi
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంలో స్పందించే నాగబాబు అప్పుడప్పుడు కాంట్రవర్సీలలో కూడా ఇరుక్కుంటారు.ఇక అందుకు ఉదాహరణగా రీసెంట్గా ఎన్నికలు జరిగిన సమయంలో బన్నీని ఉద్దేశించి ఆయన పెట్టిన పోస్ట్ ని చెప్పుకోవచ్చు. ఇక బన్నిపై పెట్టిన ఒక్క పోస్టుతో పెద్ద వివాదం సృష్టించారు. ఇక ఆయన పెట్టిన నిప్పు ఇప్పటివరకు కూడా ఆరడం లేదు. అయితే అలాంటి నాగబాబుని తాజాగా ఓ హీరోయిన్ టార్గెట్ చేస్తూ మాట్లాడింది. నీకు కూతురు లేదా అంటూ ఆ హీరోయిన్ నాగబాబుపై ఫైర్ అయింది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. నాగబాబుని ఎందుకు విమర్శించింది అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ ఇష్యూ వైరల్ అవుతున్న వేళ ఆయనకు కొంతమంది సపోర్ట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా జానీ మాస్టర్ పేరు తీయకుండానే నాగబాబు కూడా సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా ఒక పోస్ట్ పెట్టారు.దీంతో ఈ పోస్ట్ పై నటి మాధవి లత ఫైర్ అయింది. మాధవి లత అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన హీరోయిన్.

నాని హీరోగా చేసిన నచ్చావులే మూవీ లో నటిగా చేసి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో  నటించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోయినప్పటికీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే అలాంటి మాధవి లత జానీ మాస్టర్ గురించి మాట్లాడుతూ..జానీ మాస్టర్ కి కొంతమంది మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇది ఒక అమ్మాయి జీవితం. కాబట్టి జానీ వారికి మంచివాడు కావచ్చు. కానీ ఆ అమ్మాయికి మంచివాడు కాకపోవచ్చు. జానీ మాస్టర్ ఆ బాదిత మహిళపై మైనర్ గా ఉన్న సమయంలోనే దగ్గరై ఆమెను లైంగికంగా వేధించాడు. ఇక ఆయన నిజ స్వరూపం తెలుసుకున్న అమ్మాయి ఆయన్ని పక్కనపెట్టి ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంది.

కానీ ఆమె జీవితంలోకి వచ్చి పలుమార్లు ఆమెని లైంగికంగా వేధించి టార్చర్ చేయడం, కొట్టడం వంటివి చాలా బాధాకరం. అలాగే ఆ బాధిత మహిళకు అల్లు అర్జున్ సపోర్ట్ చేయడానికి ఓ కారణం ఉంది.ఎందుకంటే పుష్ప సినిమా సెట్లో గొడవ జరిగిన సమయంలో వీరు ప్రత్యక్షంగా చూశారు. అందుకే ఆ అమ్మాయికి సుకుమార్, బన్నీ లు సపోర్ట్ ఇచ్చారు. ఇక నాగబాబు గారు జానీ మాస్టర్ కి మద్దతు తెలపడం నాకు కాస్త బాధాకరం అనిపించిందది.నాగబాబు గారికి కూడా ఓ అమ్మాయి ఉంది కదా.. ముఖ్యంగా నాగబాబు గారి కూతురు వయసు కంటే ఆ భాదిత మహిళ వయసు చాలా చిన్నది. అలాంటిది ఆయనకి సపోర్ట్ గా మాట్లాడడం చాలా బాధేసింది ..అంటూ సున్నితంగా మాట్లాడుతూనే నాగబాబుపై ఇండైరెక్టుగా సెటైర్లు వేసింది నటి మాధవి లత. ప్రస్తుతం మాధవి లత మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: