బాలీవుడ్ లో దుమ్ము రేపుతున్న కీర్తి సురేష్.. మరి టాలీవుడ్ పరిస్థితి ఏంటి..?

lakhmi saranya
బాలీవుడ్ లో బిజీ అయిపోతున్న మరో యంగ్ హీరోయిన్. మరి ఎవరు కాదు కీర్తి సురేష్. కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎన్నో మూవీస్ లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక రీసెంట్గా చిరంజీవి సరసున చెల్లెలి క్యారెక్టర్ లో చేసింది ఈ అమ్మడు. వాల్తేరు వీరయ్య మూవీ లో చెల్లెలు క్యారెక్టర్ లో చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల రఘుతాత చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ కథనాయిక కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులోనే నటిస్తున్న సినిమా ఏది సెట్స్ మీద లేదు.ఒకప్పుడు తెలుగులో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా వున్న కీర్తి కి వరుస ఫ్లాపులు రావటంతో టాలీవుడ్ లో కాస్త జోరు తగ్గింది. ఇక 'మహానటి' చిత్రంలో ఉత్తమ నటనకు జాతీయ పురస్కారం అందుకున్న ఈ బ్యూటీ హవా ఇప్పుడు బాలీవుడ్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది కీర్తి సురేష్. ఈ చిత్రానికి జవాన్ దర్శకుడు, కీర్తి సురేష్ స్నేహితుడు అట్లీ కూడా నిర్మాతగా వహిస్తున్నాడు.
 తమిళంలో తర్కెక్కిన తేరీ చిత్రానికి రీమేక్ గా బేబీ జాన్ రాబోతుంది. డిసెంబర్లో ఈ చిత్రం విడుదల కానుందని తెలిసింది. ఈ చిత్రంతో పాటు బాలీవుడ్లో కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్గా నటిస్తున్నారని సమాచారం. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో బాలీవుడ్ లోని ఇద్దరూ టాప్ హీరోలు కథానాయకులుగా నటిస్తున్నారట. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, అందులో ఒక హీరోయిన్గా అట్లీ కీర్తి సురేష్ ని ఎంపిక చేశారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: