అర్థగంట టైమ్ ఇచ్చాడు.. నాలుగు వింటూనే ఉన్నాడు.. ఆ హీరో చేసిన పనికి షాక్ అయ్యాను.. పూరి జగన్నాథ్..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా స్టార్ డైరెక్టర్ల స్థాయికి ఎదిగిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టిన చాలా తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ల స్థాయికి చేరుకున్నాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ , పవన్ కళ్యాణ్ హీరోగా బద్రి అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. బద్రి మూవీ సెట్ కావడానికి ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

పూరి జగన్నాథ్ తాజాగా బద్రి సినిమా గురించి మాట్లాడుతూ ... పవన్ తో సినిమా చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నించాను. ఆ విషయం పవన్ కి మరియు అతని పిఏ కి తెలుసు. ఇక ఒక రోజు పవన్ కళ్యాణ్ పీఏ వచ్చి సార్ ఉదయం కథ వింటాను అన్నాడు. ఉదయం నాలుగు గంటలకు వచ్చే కథ చెప్పు అన్నాడు. దానితో నేను షాక్ అయ్యాను. ఉదయం నాలుగు గంటలకు కథ వింటారా ఎవరైనా అని అనగా... కళ్యాణ్ పొద్దున్నే లేస్తాడు. ఆ సమయానికే కథ వింటాడు మీరు వచ్చేయండి అన్నాడు. ఇక నేను కూడా ఉదయం నాలుగు గంటలకు పవన్ దగ్గరికి వెళ్లాను. పవన్ నేను నీకు అర్థ గంట సమయం ఇస్తాను కథ చెప్పు అన్నాడు.

దానితో నేను అర్ధ గంట సరిపోదు అన్నాను. మరి నేను నీకు అర్థ గంట ఇస్తాను కదా అన్నాడు. దానితో నేను కథ చెబుతూ వెళ్తాను మీకు బోర్ కొడితే డోర్ తీయండి వెళ్లిపోతాను. అది అర్థ గంట అవ్వనివ్వండి , ఎంతైనా సరే అన్నాను. ఓకే అన్నాడు. కథ మొదలు పెట్టాను. అర్ధ గంట అయిపోయింది. అతను కథ వింటూనే ఉన్నాడు. అలా నాలుగు గంటలు అయింది. ఉదయం నాలుగు గంటలకు మొదలు పెడితే ఎనిమిది గంటలకు కథ పూర్తి అయ్యింది అని పూరి జగన్నాథ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: