ఆ ఇద్దరు దర్శకుల వల్లే పవన్ తో సినిమా చేయగలిగాను.. దిల్ రాజు..!

MADDIBOINA AJAY KUMAR
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాల వైపు దృష్టిని మళ్లించిన విషయం మన అందరికీ తెలిసిందే. జనసేన పార్టీని స్థాపించిన కొంత కాలానికి పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాలపై దృష్టి పెట్టి ప్రజా సేవకు పూర్తి సమయాన్ని వినియోగించనున్నట్లు , దానితో సినిమాలు చేయను అని ప్రకటించాడు. కానీ తన అభిమానులు మాత్రం ఖచ్చితంగా సినిమాలు చేయాల్సిందే అని గట్టి వాదాన్ని వినిపించారు. దానితో పవన్ కళ్యాణ్ కూడా కాస్త తగ్గి సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అందులో భాగంగా సినిమాలు మానేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చిన కూడా తన అభిమానుల కోరిక మేరకు సినిమాల్లో నటించడానికి ముందుకు వచ్చాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం వకీల్ సాబ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. దిల్ రాజుకు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది అనే వివరాలను ఆయన తెలియజేశాడు. కొంత కాలం క్రితం దిల్ రాజు ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... నేను ఒక రోజు తమిళంలో రూపొందిన నర్కొండ పార్వాయి సినిమా ట్రైలర్ ను చూశాను. అది నాకు బాగా నచ్చింది. ఆ సమయంలో హరీష్ శంకర్ ఇది పవన్ కళ్యాణ్ తో చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. నాకు కూడా ఆ సలహా బాగా నచ్చింది. ఇకపోతే ఈ సినిమా హిందీ సినిమా అయినటువంటి పింక్ మూవీ కి రీమేక్ గా రూపొందింది.

ఆ తర్వాత ఒక రోజు త్రివిక్రమ్ గారిని కలిచాను. కలిసి నర్కొండా పర్వై సినిమా ట్రైలర్ ను చూపించాను. ఆయన బాగుంది విషయం ఏమిటి అని అడిగారు. ఈ సినిమా పవన్ తో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నాను. దానితో వెంటనే ఆయన పవన్ ను కల్పించాడు. ఈ సినిమా గురించి చెప్పాను. ఆ తర్వాత పవన్ కూడా పింక్ సినిమాను చూసి అది బాగా నచ్చడంతో రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: