హీరోకు సర్వం ఇచ్చేసిన త్రిష..ఆ పని కోసమేనా ?

Veldandi Saikiran
నీ మనసు నాకు తెలుసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన త్రిష మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ సినిమా అనంతరం వర్షం సినిమాలో నటించి చాలామందికి ఫేవరెట్ హీరోయిన్. ఈ బ్యూటీ వర్షం సినిమాలో తన అద్భుతమైన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రతి ఒక్క కుర్రాడి మనసును దోచుకుంది. నాలుగు పదుల వయసులోనూ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరికీ గట్టి పోటీని ఇస్తుంది. ప్రస్తుతం త్రిష చేతిలో ఆరు సినిమా ప్రాజెక్టులో ఉన్నాయి.

త్రిషతో హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయమైన వారంతా సైడ్ క్యారెక్టర్లలో నటిస్తుంటే త్రిష మాత్రం ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తోంది. అదే అందం, మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వస్తోంది. వయసు పెరిగే కొద్దీ ఈ బ్యూటీ అందం పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, త్రిష విజయ్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ది గోట్ లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గోట్  మూవీ వచ్చింది.
ఇదిలా ఉండగా.... యాక్షన్ చిత్రాల్లో నటించి, యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నటువంటి భానుచందర్ ప్రస్తుతం చెన్నైలో తన ఇంట్లో నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడు రెండు తెలుగు సినిమాల్లో నటించారు. రెండో కుమారుడు డాక్టర్గా పనిచేస్తున్నాడు. అయితే భానుచందర్ ఉంటున్న ఇల్లు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ త్రిషది. సినిమాల్లో హీరోయిన్గా నటించిన సమయంలో తనకు వచ్చిన ఆదాయంతో ఆ ఇంటిని కొనుగోలు చేసి కొంతకాలం పాటు అందులోనే నివాసం ఉంది. ఆ తర్వాత వేరే ఇంటికి మారే సమయంలో ఆ ఇంటిని భానుచందర్ కు ఇవ్వడం జరిగింది.
ఇక భానుచందర్ ఆ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, మంచి గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయం తాజాగా బయటపడటంతో ఆ హీరోకి త్రిష తన ఆస్తిని రాసిచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో త్రిష నోరు విప్పితే కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: