కీర్తి సురేష్ లేటెస్ట్ పోస్ట్...'ఫిదా' అంటూ కుర్రోళ్ళు కామెంట్లు..!

lakhmi saranya
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలు నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. రీసెంట్గా దసరా మూవీలో హీరోయిన్గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి సరసున వాల్తేర్ వీరయ్య మూవీలో హీరోయిన్గా నటించిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. దసరా మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
 'నేను శైలజ, నేను లోకల్, మిస్ ఇండియా, మహానటి, రంగ్ దే' వంటి బ్లాక్బస్టర్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. నటి కీర్తి సురేష్ . అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా 'భోళా శంకర్' చిత్రంలో, రజనీకాంత్ సినిమాలో కూడా సూపర్ స్టార్ కు ముద్దుల చెల్లిగా నటించింది. టాలీవుడ్ లో దూసుకుపోతూనే ఈ ముద్దుగుమ్మ మరోవైపు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ సరసన అవకాశం కొట్టేసింది. వీరి జోడితో తరికెక్కుతున్న బేబీ జాన్ చిత్రం డిసెంబర్ చివర్లో విడుదల తానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
 ఇకపోతే కీర్తి సురేష్ తాజాగా అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. స్లివ్ లెస్ పంజాబీ డ్రెస్ ధరించి, డ్రెస్సుకు తగ్గ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని క్యూట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. తాజాగా కీర్తి కిర్రాక్ ఫోటోలకు ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకోగా...ఫిదా అంటూ కీర్తి సురేష్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. క్యూట్ కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టెంటా వైరల్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ ఆమె క్యూట్ ఫోటోలు తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఎల్లప్పుడూ పోస్టులు పెడుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: