బిగ్ బాస్ 8 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న బుల్లితెర నటి.. ఎవరంటే..!

lakhmi saranya
బిగ్ బాస్ లో నాగార్జున యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రారంభం అయింది. ఇక ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి. చాలామంది కంఠస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మోదలై వారం పూర్తి కావోస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ రోజు నుంచే ఆట మొదలెట్టి గొడవలు పడుతున్నారు. ఈసారి లిమెట్ లెస్ అని నాగార్జున చెప్పినట్లుగానే రోజు ట్విస్టులు ఇస్తూ ఆసక్తికరంగా మారింది.
అయితే వారం పూర్తి కావస్తుండటంతో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళబోతున్నారు. దీంతో బిగ్ బాస్ మేకర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం..బుల్లితెర స్టార్ నటి జ్యోతి రాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ టీం ఆమెను సంప్రదించారని కానీ షూటింగ్ వల్ల వెళ్లలేక పోతున్నానని తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు వాళ్లు వైల్డ్ కాట్ ఎంట్రీ కి ఛాన్స్ ఇచ్చినట్లు టాక్. అయితే ఇప్పుడు జ్యోతి రాయి హౌస్ లోకి వెళ్లబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు.
 కాగా, జ్యోతి రాయి బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. మంచి నటిగా గుర్తింపును సంపాదించుకుంది. ఇందులో సాంప్రదాయ లుక్ లో కనిపించి అందరికీ మంత్రముగ్దులను చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. తన హాట్ పిక్స్ షేర్ చేసి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకుంటోంది. ఇక జ్యోతిరాయ్ ఓ యంగ్ డైరెక్టర్ను రెండవ పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తోంది. అలాగే పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఫుల్ బిజీ లైఫ్ ను గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: