ఆ హీరోయిన్ పై పీకలదాకా కోపం పెంచుకున్న రమ్యకృష్ణ..?

Pandrala Sravanthi
కెరియర్ మొదట్లో ఐరన్ లెగ్ పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఆ తర్వాత ఎంతోమంది హీరోలకు లక్కీగా మారిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మరో హీరోయిన్ పై పీకల్లోతు కోపం పెంచుకుందట. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు రమ్యకృష్ణ ఆమెపై అంత కోపం పెంచుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. రమ్యకృష్ణ కోపం పెంచుకుంది అంటూ వస్తున్న వార్తలు ఎవరి గురించో కాదు దివంగత నటి సౌందర్య.. తన నటనతో ఎంతోమందిని మెప్పించి దాదాపు ఎన్నో సంవత్సరాలు తన స్టార్డం ని కొనసాగించిన సౌందర్య  గ్లామరస్ పాత్రలకు చాలా దూరంలో ఉండేది.అంతే కాదు ఇలాంటి సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అని కొంతమంది మీడియా వాళ్ళు అడిగితే అలాంటి గ్లామరస్ పాత్రల్లో నటించి పెళ్లయ్యాక భర్త తో కలిసి సినిమా చూస్తే ఆ సినిమాని నేను నా భర్తతో ఎలా చూడగలను అని చెప్పేది.

అయితే సౌందర్య కి,రమ్యకృష్ణ కి మధ్య గొడవ ఎక్కడ వచ్చింది అనేది చూస్తే సౌందర్య,రమ్యకృష్ణ కాంబినేషన్లో నరసింహ, అమ్మోరు, మానవుడు దానవుడు,హలో బ్రదర్ వంటి సినిమాలు వచ్చాయి.అయితే వీరిద్దరి కాంబినేషన్లో అన్ని సినిమాలు వచ్చాయి కాబట్టి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక సౌందర్య చనిపోయిన సమయంలో కూడా రమ్యకృష్ణ చాలా బాధపడింది.కానీ వీరిద్దరి మధ్య గొడవ ఉన్నటువంటి వార్తలు ఎందుకు వచ్చాయంటే..

వెంకటేష్ హీరోగా చేసిన పవిత్ర బంధం సినిమాలో మొదట హీరోయిన్ గా రమ్యకృష్ణ సెలెక్ట్ అయిందట.కానీ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య మాత్రం రమ్యకృష్ణ పక్కన పెట్టి వెంకటేష్ తో సౌందర్యని పర్ఫెక్ట్ జోడి అని ఆమెను తప్పించి సౌందర్యను తీసుకున్నారట.ఇక ఈ విషయం బయటపడ్డాక కొంతమంది తన అవకాశాన్ని తన్నుకుపోయినందుకు సౌందర్య మీద రమ్యకృష్ణ పీకల్లోతు కోపం పెంచుకుంది అనే రూమర్స్ వినిపించాయి కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: