హాస్పిటల్లో చేరిన డైరెక్టర్ వి.వి.వినాయక్.. ఏం జరిగిందంటే..?

Divya
గతంలో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ వివి వినాయక్ ఈ మధ్యకాలంలో ఎక్కడ యాక్టివ్ గా కనిపించడం లేదు. చివరిగా 2023లో హిందీ చత్రపతి అనే సినిమా తర్వాత మళ్లీ ఎక్కడ తన సినిమా గురించి తెలియజేయలేదు. ఆ మధ్య బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు చేయబోతున్నారని అందుకు తగ్గట్టుగా చర్చలు జరుగుతున్నాయని విషయాలు మాత్రం వినిపించాయి. కానీ అందుకు సంబంధించి మళ్లీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తాజాగా వివి వినాయక్ అనారోగ్యం పాలవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల వివి వినాయక్ లివర్కు సంబంధించిన సర్జరీ కూడా జరిగిందని హైదరాబాదులో  కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అయితే ఆయన కోలుకున్నారని త్వరలోనే వైద్యులు కూడా డిశ్చార్జ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 2014 నుంచి వరుస డిజాస్టర్లు చూస్తున్న సమయంలో చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. అయినా కూడా ఎలాంటి అవకాశాలు మాత్రం అందుకోలేకపోయారు డైరెక్టర్ వివి వినాయక్.

ప్రస్తుతం అనారోగ్య సమస్యల నుంచి బయటపడి తిరిగి తన ఫిట్నెస్ ని సాధించి దర్శకుడిగా మరొకసారి తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తన సినిమాల ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సైతం తన వంతు సహాయంగా చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. అఖిల్ సినిమా వల్ల నష్టపోయిన వారికి కూడా చాలానే సహాయం చేశారు. వివి వినాయక్ కెరియర్ లో దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్ ,లక్ష్మి, కృష్ణ తదితర చిత్రాలతో మంచి విజయాలనైతే అందుకున్నారు. గడిచిన కొన్ని సంవత్సరాలు క్రితం తన బయోపిక్ సీనయ్య అనే సినిమా పోస్టర్ని సైతం విడుదల చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ కొంత భాగం వరకు జరగగా కొన్ని కారణాల చేత ఆగిపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: