బోయపాటి, త్రివిక్రమ్ ఆటలు ఇకపై సాగవు.. ఇద్దరి కెరీర్ ఖతం..?
బోయపాటి శ్రీనుకి కూడా ఈ ఏడాది పెద్ద షాక్ తగిలింది. ఆయన ఎప్పుడూ యాక్షన్ సినిమాలే తీస్తుంటారు అవన్నీ రొటీన్ సినిమాలే. ఆయన రామ్ పోతినేని హీరోగా తీసిన 'స్కంద' సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. బోయపాటి మాస్ ఆడియన్స్కి నచ్చే సినిమాలు చేసినా, ఆయన కథలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండటం వల్ల మాస్ ఆడియన్స్కు బోరు కొడుతోంది. థియేటర్లకి వెళ్లి చూసేంత కొత్తగా కథలు ఉండడం లేదనేది చాలా మంది అభిప్రాయం.
గత వారం ఇంకో ఇద్దరు పెద్ద దర్శకుల సినిమాలు బాగా ఫ్లాప్ అయ్యాయి. పూరి జగన్నాథ్ 'డబుల్ ఇస్మార్ట్', హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాలలో అతిగా గ్లామర్ని చూపించడం, ఇబ్బందికరంగా ఉండే సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాలను విమర్శించారు. ఈ రెండు సినిమాలు బాగా ఫ్లాప్ అయిపోవడంతో, టాలీవుడ్లోని పెద్ద దర్శకులు తమ మ్యాజిక్ని కోల్పోతున్నారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
త్రివిక్రమ్, బోయపాటి లాంటి దర్శకులు ఎప్పుడూ ఒకే ఫార్ములా కథలతో ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు కొత్త కథల కోసం ఎదురు చూస్తున్నారు. పాత కథలతో సినిమాలు హిట్ అవుతాయనే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రేక్షకులకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఎన్నో రకాల ప్లాట్ఫామ్లు ఉన్నాయి. సినిమాలు కాకుండా, వెబ్ సిరీస్లు, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి. దీంతో దర్శకులు కూడా తమ సినిమాల్లో కొత్త కథలు, కొత్త విషయాలు పెట్టాలి. లేకపోతే ప్రేక్షకులు వారి సినిమాలను చూడరు. వారి కెరీర్ ఖతం అవుతుంది.