దర్శకురాలికి భారీ షాక్.. నెట్ఫ్లిక్స్ అండ్ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్ట్..!

lakhmi saranya
ఈరోజుల్లో చిన్నపిల్లల మీద కూడా లైంగిక దాడి చేస్తున్నారు. ఇలా చాలా ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. చిన్నవాళ్లు పెద్దవాళ్లు అని తేడా లేకుండా లైంగిక దాడులు చేస్తున్నారు. దాడి చేయటమే కాకుండా చంపాలి అని కూడా చూస్తున్నారు. జార్ఖండలో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు కుర్రోళ్ళు లైంగిక దాడి చేసి దారుణంగా చంపాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఎలాగోలా బయటపడ్డ బాలిక..తనకు జరిగిన అన్యాయం పై ఎలాగైనా పోరాడాలని నిర్ణయించుకుంది.

గ్రామస్థులంతా ఈ ఘటనపై వ్యతిరేకంగా మాట్లాడిన తండ్రి కూతుళ్లు ఇద్దరూ పోరాటం చేశారు. చివరికి 'ఏ కిల్ ఏ టైగర్' అనే టైటిల్ లో డ్యాకుమెంటరి తీశారు. దీనికి నిషా పహూజా దర్శకత్వం వహించారు. ఈ డ్యాకుమెంటరి 2024 ఆస్కార్‌కు నామినేట్ కూడా అయ్యింది . చట్టాన్ని ఉల్లంఘించి ..ఈ డాక్యుమెంటరీలో రేప్ బాధితురాలి గుర్తింపును తెలిపినందుకు తాజాగా ఢిల్లీ హైకోర్టు డైరెక్ట్ ర్ అండ్, నెట్ఫ్ ఫ్లిక్స్ లై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ పిటిషన్ పై సూచనల కోసం కాస్త టైమ్ తీసుకుంటామని కేంద్ర తరపున లాయర్ కోరారు.

బాలిక తల్లిదండ్రుల అంగీకారంతోనే ఈ డాక్యుమెంటరీ తీశారని నెట్ ఫ్లిక్స్ తరపు న్యాయవాది వాదించారు. దీనితో నాలుగు వారంలో కోర్టుకు సరైన సమాధానం చెప్పాలని హైకోర్టు డ్యాకుమెంటరి దర్శకురాలు నిషా పహుజ, నెట్ ఫ్లిక్స్ కు నోటీసులు జారీ చేసింది. ఈ బాలిక తీర్పు ఏ విధంగా వస్తుందో చూడాలి. మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండేలాగా చూడాలి అని జనాలు అంటున్నారు. చిన్నపిల్లల మీద మితిమీరి ప్రవర్తిస్తే శిక్ష పడేలాగా చేయాలని కోరుతున్నారు. ఇలా జరిగిన రోజు పిల్లల జోలికి వెళ్లకుండా ఉంటారు అని అంటున్నారు. దీనిని హత్య ప్రయత్నం కింద కేసు పెట్టి జైలుకి పంపాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: