సోషల్ మీడియాలో దూసుకుపోతున్న శివం భజే ట్రైలర్..!?

Anilkumar
యువ దర్శకుడు అప్సర్ దర్శకత్వం వహించిన అశ్విన్ బాబు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "శివం భజే". అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ విడుదలై 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఘన విజయం సాధించింది. ఇక ఈ ట్రైలర్ చూసిన అభిమానులకి ఈ చిత్రం పై భారీ అంచనాలను పెరిగిపోయాయి. అయితే ఆ ట్రైలర్ లో అశ్విన్ బాబు పాత్ర చాలా డిఫరెంట్ గా ఉందని, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని లుక్ లో కనిపించాడని తెలుస్తుంది. ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను

 ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివరి షాట్ లో అశ్విన్ బాబు భయంకరమైన రూపంలో కనిపించి ఆసక్తిని రేకెత్తించాడు. ఇది ఇలా ఉంటే అప్సర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అతను గతంలో కొన్ని ప్రముఖ దర్శకులకు సహ దర్శకుడిగా పనిచేశాడు. "శివం భజే" చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో అశ్విన్ బాబు సరసన డిగంగనా సుర్యవంశీ హీరోయిన్ గా నటించగా హైపర్ ఆది, సాయి ధీన, తులసి తదితరులు ఈ సినిమాలో నటించనున్నారు. 

ఇక "శివం భజే" సినిమా ఆగష్టు 1, 2024న థియేటర్లలో విడుదల కానుంది. సాయి ధీన, తులసి తదితరులు నటిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్‌రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనితో అభిమాను ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి విభిన్న కథాంశమిదని, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించామని, ప్రేక్షకులకు ఆద్యంతం థ్రిల్‌ని పంచడంతో పాటు సరికొత్త విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: వికాస్‌ బడిస, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాహి సురేష్‌, దర్శకత్వం: అప్సర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: