మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్: గేమ్ చేంజర్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన థమన్..!?

Anilkumar
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో రాబోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇకపోతే రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు దాటింది ఈ సినిమా ప్రకటించి.

ఈ సంవత్సరం లోపు ఎలాగైనా శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.  అయితే తాజాగా జూలై 23న హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్లో గేమ్ ఛేంజర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కొన్ని విషయాలు పంచుకున్నారు.  "గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఆగస్టు చివరివారంలో వరుస అప్డేట్స్ వస్తాయని..ఇక సెకండ్ సాంగ్ కూడా అప్పుడే వస్తుందని హింట్ ఇచ్చారు. త్వరలో డైరెక్టర్ శంకర్ సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్ చేయాల్సి ఉందని అన్నారు. లాగే ఈ సినిమాలో మొత్తానికి ఏడు పాటలు ఉంటాయని..

వచ్చే సెకండ్ సాంగ్ మాత్రం ఎలాంటి లీకులు జరగక ముందే రిలీజ్ చేస్తామని వెల్లడించారు.  అంతేకాకుండా ఇటీవలే ప్రొడ్యూసర్ దిల్ రాజు డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ ఉంటుందని తెలిపారు. అయితే, ఈ మూవీ నుంచి 'జరగండి.. జరగండి' సాంగ్ మినహా మరే ఎలాంటి మేజర్ అప్‍డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.   ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ సినిమా గురించి కొంత కాలంగా ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. గేమ్ ఛేంజర్ సినిమాకు పార్ట్ 2 రానుందని. దాంతో ఆ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇక ప్రమోషన్స్ షురూ చేస్తే గానీ, సెకండ్ పార్ట్ పై క్లారిటీ వస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: