సినిమా సినిమాకి క్రేజ్ పెంచుకుంటున్న యువ దర్శకుడు వీరే..?

MADDIBOINA AJAY KUMAR
కొంత మంది దర్శకులు సినిమా సినిమాకి తమ క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్నారు. ఆ దర్శకులు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.
తెలుగులో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో నాగ్ అశ్విన్ ఒకరు. ఈయన నాని హీరోగా రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమా సమయంలో ఈ దర్శకుడు అంటే ఎవరో ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను , విమర్శకులను బాగానే మెప్పించింది ఈ సినిమాతో ఈయన కొంత మంది కి తెలిసాడు.

ఇక ఆ తర్వాత ఈ దర్శకుడు మహానటి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈ దర్శకుడి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈయన గురించి ఇండియా మొత్తం తెలిసింది. ఇకపోతే విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు.

ఈ మూవీ తో ఈయనకు అద్భుతమైన క్రేజ్ లభించింది. తెలుగు సినీ పరిశ్రమలో ఈ మూవీ ద్వారా ఈయనకు సూపర్ గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన ఇదే సినిమాను కబీర్ సింగ్ అనే పేరుతో హిందీ లో రీమేక్ చేశాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు హిందీలో కూడా గుర్తింపు లభించింది. ఆఖరుగా ఈ దర్శకుడు యానిమల్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా ఈయన గురించి ఇండియా మొత్తం తెలిసింది. ఇలా ఈ ఇద్దరు తెలుగు దర్శకులు సినిమా సినిమాకు తమ క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: