ఆ దెబ్బతో రామ్.. విక్రమ్ ఓపెనింగ్లకి గండి కొట్టనున్న రవితేజ..?

Pulgam Srinivas
చాలా రోజుల క్రితమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీని ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీకి దగ్గరలో ఎవరు తమ సినిమా విడుదల తేదీలను పెద్దగా ప్రకటించలేదు. ఇక ఎప్పుడు అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ కానున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక అందులో భాగంగా ఈ సినిమా విడుదల తేదీ క్యాన్సల్ అయినట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావడంతో ఇప్పటికే ఆగస్టు 15 వ తేదీన రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న డబల్ ఇస్మార్ట్ మూవీ ని , విక్రమ్ హీరోగా రూపొందుతున్న తంగాలం సినిమాలను ఈ తేదీనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక రవితేజ హీరోగా రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ మూవీ ని కూడా ఇదే తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ మూవీ బృందం విడుదల తేదీని ప్రకటించలేదు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డబల్ ఇస్మార్ట్ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన కాకుండా అంతకు ఒక రోజు ముందు అనగా ఆగస్టు 14 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరో ఒకటి , రెండు రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే ఈ మూవీ బృందం ఆగస్టు 14 వ తేదీన మిస్టర్ బచ్చన్ మూవీ ని విడుదల చేసినట్లు అయితే ఈ సినిమాకు మంచి టాక్ వస్తే డబుల్ ఇస్మార్ట్ , తంగాలం మూవీ లకు ఓపెనింగ్స్ తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. మరి డబల్ ఇస్మార్ట్ మూవీ కి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: