టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఎంతో కష్టపడి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే, మరోవైపు మాస్ ప్రేక్షకులకు దగ్గరవ్వడం రామ్ కే చెల్లింది.సాధారణంగా హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ఆడియెన్స్లో నెలకొనే అంచనాలు అంతా ఇంతా కాదు. తొలిపార్టుకు మంచి సీక్వెల్ పార్టు ఉంటుందని ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తుంటారు. కాగా అలాంటి అంచనాలతో రూపొందుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఐదేళ్ల కిందట బాక్సాఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికీ టాలీవుడ్ టాప్-10 మోస్ట్ ప్రాఫిటెబుల్ మూవీస్ లిస్ట్లో ఇది ఒకటి.అప్పటివరకు లవర్ బాయ్ రోల్స్తో అదరగొట్టిన రామ్ పోతినేని.. తొలిసారి మాస్ క్యారెక్టర్లో ఇరగదీశాడు. ఈ సినిమాతో రామ్కు మాస్ ఆడియెన్స్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత రామ్ కథల ఎంపికలో కూడా చాలా చేంజేస్ వచ్చాయి. అదే క్రేజ్తో డబుల్ ఇస్మార్ట్ ను స్టార్ట్ చేశారుగతేడాది జులై లో సెట్స్ మీదకు వెళ్లిన డబుల్ ఇస్మార్ట్.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసకుంటుంది.పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. రీసెంట్ గానే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ వదిలారు. ‘స్టెప్పమార్’ అంటూ సాగే ఈ పాటలో రామ్ మాస్ స్టెప్స్ తో రామ్ దుమ్ములేపాడు.
దీంతోఈ సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ ప్రోమోను లాంచ్ చేశారు. ఇస్మార్ట్ శంకర్లో ఫేమస్ అయిన మార్ ముంతా చోడ్ చింతా డైలాగ్నే సాంగ్గా పెట్టి మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు పూరీ. రామ్, కావ్య థాపర్ అండ్ టీంపై పార్టీ మూడ్లో సాగుతున్న ఈ మాస్ సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.ఇదిలావుంటే తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో 8 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.ఈ సినిమా ఆగష్టు 15, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.