ఆ విషయంలో మిగతా స్టార్స్ తో పోలిస్తే వెనుకబడిపోయిన వెంకీ.. ఆ లెక్కను నెక్స్ట్ మూవీ తో సెట్ చేసినా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగులో ఒకానొక సమయంలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలుగా కెరియర్ ను కొనసాగించిన వారు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ వీరు నలుగురు కూడా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగించారు. ఇక ప్రస్తుతం కూడా వీరు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే కొన్ని సమయాల్లో వీరికి అపజయాలు వచ్చినా కూడా మళ్లీ మీరు మంచి విజయాలను అందుకుంటున్నారు. 

కొంతకాలం పాటు రాజకీయాలపై దృష్టి పెట్టిన మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" సినిమాతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని అపజయాలు వచ్చినా కూడా మళ్లీ చిరంజీవి "వాల్టేరు వీరయ్య" మూవీతో అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం వరుస అపజాయలను ఎదుర్కొన్న అఖండ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకొని కం బ్యాక్ ఇచ్చారు.

ఆ తర్వాత నుండి బాలయ్య వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్ లో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఈయన బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన నా సామి రంగ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇక ఇప్పటివరకు నాకు తన నెక్స్ట్ మూవీ ని కన్ఫామ్ చేయకపోయినా కథలను వింటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో విజయాల విషయంలో వెంకీ ఈ ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలతో పోలిస్తే కాస్త వెనుకబడిపోయాడు. ఎందుకు అంటే ఈయన ఆఖరుగా విజయం అందుకొని చాలా కాలం అవుతుంది.

మధ్యలో వెంకటేష్ నటించిన దృశ్యం 2 , నారప్ప సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఇవి థియేటర్లలో కాకుండా ఓటీటీ లో విడుదల అయ్యాయి. ఇక ఎఫ్ 3 మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరోగా నటించడంతో ఈయనకు సోలోగా విజయం దక్కలేదు. ఇక ఆఖరుగా వెంకీ నటించిన సైంధవ్ సిన థియేటర్లలో విడుదల అయింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ప్రస్తుతం వెంకీ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుక విడుదల చేయనున్నారు. ఈ మూవీతో వెంకీ అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటాడు అని వెంకీ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: