మరో క్రేజీ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్..?

murali krishna
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌.. గత కొంత కాలంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు..ఈ ఏడాది వెంకీ సైంధవ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన ఈ యాక్షన్‌ మూవీ  బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సినిమాలో విపరీతమైన యాక్షన్‌ తేడా కొట్టడంతో వెంకీ మళ్ళీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వైపు టర్న్ అయ్యారు..తనకు ఎఫ్‌ 2, ఎఫ్‌3 వంటి వినోదాత్మక చిత్రాలను అందించిన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభమైంది. రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా షురూ అయినట్టు సమాచారం..ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే వెంకీ ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి..

 నీది నాది ఒకే కథ, విరాట పర్వం వంటి చిత్రాలతో అదరగొట్టిన దర్శకుడు వేణు ఉడుగులతో వెంకీ ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. వెంకీకి దర్శకుడు వేణు చెప్పిన కథ బాగా నచ్చిందని తెలుస్తుంది. దీంతో సినిమా చేసేందుకు ఆసక్తిని కనబరిచినట్టు సమాచారం. అన్ని  అనుకున్నట్లు జరిగితే వెంకీ తరువాత సినిమాగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని సమాచారం.ఇదిలా ఉంటే దర్శకుడు వేణు ఉడుగుల చేసిన గత మూవీ `విరాటపర్వం`లో రానా హీరో గా నటించారు.సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.  నక్సల్‌ బ్యాక్ డ్రాప్‌లో రియలిస్టిక్‌ అంశాలతో ఈ సినిమా రూపొందించారు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా మాత్రం అంతగా సత్తా చాటలేకపోయింది. ఈ సినిమా తరువాత దర్శకుడు వేణు హీరో నాగ చైతన్యకు ఒక స్టోరీ చెప్పినట్లు సమాచారం. అయితే ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు.. ఈ లోపు వెంకీ తో మూవీ సెట్ చేసుకునేందుకు వేణు ప్రయత్నిస్తున్మారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: