ప్రియదర్శి మరో హిట్ కొట్టినట్టే.. ఆ రెండు విషయాలతో క్లారిటీ వచ్చేసింది..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటులలో ప్రియదర్శి ఒకరు. ఈయన సినిమాలలో కమెడియన్ పాత్రలలో మాత్రమే కాకుండా హీరోగా నటిస్తూ కూడా కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు డార్లింగ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నబా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను జూలై 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు ఈ మూవీ బృందం భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతుంది.

దానికి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ మూవీ పై ప్రస్తుతానికి మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ హిట్ అయినట్టే అనే చాలా మంది భావిస్తున్నారు.

అలా ప్రేక్షకులు భావించడానికి ప్రధాన కారణం ఈ మూవీ యొక్క నైజాం హక్కులను మైత్రి సంస్థ దక్కించుకోగా , ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులను ఏషియన్ సురేష్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ రెండు సంస్థలు కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న డిస్ట్రిబ్యూషన్ సంస్థలు. ఈ రెండు సంస్థలు ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీరు సినిమా బాగుంటేనే కొనుగోలు చేసి ఉంటారు. లేకపోయి ఉంటే ఇంత మంచి సంస్థలు ఈ మూవీ ని కొనుగోలు చేయవు. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: