మెగాస్టార్ విశ్వంభర నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్  మెగాస్టార్ చిరంజీవి తాజాగా "విశ్వంభర" సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. యంగ్ డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని   తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్ తో అభిమానులను అలరించినన్నారు. త్రిష ఇందులో హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాలో దర్శకుడు ఏలియన్స్ ను కూడా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి నిన్ననే మ్యూజిక్ సిట్టింగ్స్  కూడా జరిగాయి.

 అయితే ప్రముఖ రచయిత విశ్వంబరం సినిమాలో ఒక పాట విషయంలో చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అదేంటంటే... చిరంజీవి, కీరవాణి మరియు వశిష్ట వీళ్ళ ముగ్గురిని మెన్షన్ చేసి మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ. ఇంకా ఈ పాటకు సంబంధించి నేను ఎక్కువ రివిల్ చేయలేను. అంతేకాకుండా అందరూ ఈ పాటని వినడానికి నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఆ రచయిత. ఆల్ ఓవర్ గా చెప్పాలంటే ఆ పాట కోసం ఆయన ఎంతో ఎగ్జైట్ అవుతున్నారని చెప్పవచ్చు.

 దానితో కీరవాణి వశిష్ట  ఈ సినిమాలో అతని దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన సాంగ్ ని రాబట్టినట్టే ఉన్నారని చెప్పాలి. ఇక ఇది కాసేపు పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల చేయనున్నారు మేకర్స్. అంతేకాకుండా ఈ భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అయితే   విశ్వంభర కోసం కీరవాణి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యం అవుతుండటంతో కీరవాణి తన పూర్తి ఫోకస్‌ను విశ్వంభర మీద పెట్టినట్టుగా ఉన్నాడు. త్వరగా ఈ విశ్వంభర కంపోజింగ్‌ను పూర్తి చేయాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. చిరంజీవి అయితే ఈ మూవీ షూటింగ్‌లో ఫుల్ ఎనర్జీగా, మరింత యంగ్‌గా కనిపిస్తున్నాడు. చిరంజీవితో అయితే కొత్త ప్రపంచాన్ని వశిష్ట క్రియేట్ చేయబోతోన్నాడని మెగా ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: